Don't Miss!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
‘ఎన్టీఆర్-కథానాయుడు’ స్పెషల్ షోలు... అభిమానులకు పండగే!
బాలకృష్ణ, విద్యా బాలన్ ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్-కథానాయకుడు' జనవరి 9న విడుదలవుతున్న నేపథ్యంలో నిర్మాతల విన్నపం మేరకు ఏపీ ప్రభుత్వం స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చింది.
2018 పోల్: ఈ హీరోలు, హీరోయిన్ల జాతకాలు మీ చేతుల్లోనే.. ఓట్ వేసి గెలిపించండి!
జనవరి 9 నుంచి 16 వరకు ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్య అదనంగా రెండు షోలకు అనుమతి లభించింది. దీంతో రోజూ 4 ఆటలకు బదులు 6 ఆటలు ప్రదర్శింపబడనున్నాయి. పండగ సమయం కావడంతో ఇది కలెక్షన్ల పరంగా మరింత కలిసొచ్చే అంశం.
మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా ఈ బయోపిక్ రూపొందుతుండగా మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' జనవరి 9న, రెండో భాగం 'ఎన్.టి.ఆర్ మహానాయకుడు' ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.
ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ 'యూ' సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు అయింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎన్బికె ఫిల్మ్స్ నిర్మాణంలో వారాహి చలన చిత్రం సమర్పణలో ఈ బయోపిక్ విడుదల కాబోతోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.