Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
Project K: ప్రభాస్ మూవీకి అదిరిపోయే బిజినెస్ ఆఫర్.. నైజాంలో రికార్డుస్థాయిలో ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ K సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహానటి సినిమా తర్వాత టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో భారీ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిర్మాత సి.అశ్విని దత్ వైజయంతి మూవీస్ లో ఈ సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు.
కేవలం ఇండియన్ లాంగ్వేజెస్ లోనే కాకుండా పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ లో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ప్రాజెక్ట్ K సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కూడా సినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకోవడానికి కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల అశ్విన్ దత్ నైజాం ఏరియా కు సంబంధించిన డీల్ ను క్లోజ్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ అలాగే నిర్మాత దగ్గుపాటి సురేష్ సంయుక్తంగా కలిసి ఈ సినిమా నైజాం హక్కులను దాదాపు 70 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం ఒక నైజాం ఏరియాలోనే సినిమా ఈ స్థాయిలో ధర పలుకుతుంది అంటే ఇంకా మిగతా ఏరియాలో అలాగే మిగతా భాషల్లో ఎంతవరకు బిజినెస్ చేసే అవకాశం ఉందో ఊహలకు అందడం లేదు.
తప్పకుండా సినిమా అయితే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మూడో విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక మేయిన్ హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తుండగా ఒక ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40% పూర్తయ్యింది. ఇక మిగిలిన షూటింగ్ ను అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఇదే ఏడాది పూర్తి చేసుకుని 2024లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.