ఓటీటీలో బీమ్లా నాయక్.. అభిమానులకు అసలు క్లారిటీ ఇచ్చిన పవన్ నిర్మాత!
పవర్ స్టార్ అభిమానులు మొత్తానికి ఈ ఏడాది వకీల్ సాబ్ సినిమాతో పూర్తిస్థాయిలో సంతృప్తి కాకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ ను వెండితెరపై ఒక మంచి అంశంతో చూసినందుకు ఆనందపడ్డారు. అసలు వెండితెరపై మళ్లీ పవన్ కళ్యాణ్ చూస్తామా లేదా అని అనుకున్న తరుణంలో మంచి పాయింట్ తో వచ్చి బాక్సాఫీస్ వద్ద తనదైన శైలిలో ఒపెనింగ్స్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా అభిమానుల సంఖ్య కూడా ఏ మాత్రం తగ్గేదని ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే భవిష్యత్తులో మరిన్ని సినిమాలు కూడా వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో భీమ్లా నాయక్ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఇక ఆ విషయంలో అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్న తరుణంలో చిత్రనిర్మాత అసలు క్లారిటీ ఇచ్చేశారు.

త్రివిక్రమ్ పర్యవేక్షణలోనే
వకీల్ సాబ్ అనంతరం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ అంతకంటే ముందే దర్శకుడు త్రివిక్రమ్ సలహాతో అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ సినిమా షూటింగ్ ను త్వరగా ముగించుకుని అవకాశం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ పెద్దగా ఆలోచించకుండా దర్శకుడిపై నమ్మకంతో గ్రీన్సిగ్నల్ ఇచ్చాడు. పవన్ కు అనుకూలంగా ఉండేలా త్రివిక్రమ్ కూడా ఒక సరైన ట్రాక్లో సెట్ చేయిస్తున్నారు. దర్శకుడు సాగర్ కే చంద్ర అయినప్పటికీ ప్రతి పని కూడా త్రివిక్రమ్ పర్యవేక్షణలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఓటీటీలో భీమ్లా నాయక్
భీమ్లా నాయక్ సినిమా తప్పకుండా వెండి తెరపై చూస్తేనే అద్భుతంగా ఉంటుందని ఇప్పటికే విడుదలైన టీజర్స్ తో ఒక క్లారిటీ వచ్చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మొదటి సినిమా కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులలో సినిమాపై అంచనాలు స్థాయి అమాంతంగా పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ఇటీవల మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. సంక్రాంతికి పోటీ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన ఆ చిత్ర నిర్మాత అమెజాన్ ప్రైమ్ లో సినిమాలు విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో కూడా టాక్ వచ్చింది.

క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ఇక రూమర్స్ డోస్ ఎక్కువ కాక ముందు చిత్ర నిర్మాత నగవంశీ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమా థియేటర్ లోనే విడుదల కాబోతోందని, అనుకున్న సమయానికి 2022 జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదని కూడా అన్నారు. దీంతో అభిమానులకు ఫైనల్ గా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.
Recommended Video

త్వరలోనే మరొక అప్డేట్
భీమ్లా నాయక్ షూటింగ్ కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ సినిమా పనులను కూడా కాస్త పక్కన పెట్టి ఈ సినిమా పనులను పూర్తి చేసే పనిలో బిజీ అయ్యాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ కూడా సినిమాలో ప్లస్ పాయింట్స్ అని తెలుస్తోంది. ఇక సంగీత దర్శకుడు థమన్ కూడా అంచనాలకు తగ్గట్లు గానే మ్యూజిక్ అందిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూవ్స్ అందుకుంటోంది. త్వరలోనే మరోక ముఖ్యమైన అప్ డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











