Just In
- 4 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్లో నలుగురు దర్శకులు!
- 5 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 6 hrs ago
నాగ్తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 7 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
రైతు నేతలను కాల్చి చంపేదుకు కుట్ర: ఓ వ్యక్తిని పట్టుకున్న రైతులు
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎన్టీఆర్ సినిమాను రిజెక్ట్ చేసిన రష్మిక: అసలు కారణం అదేనంటూ ప్రచారం
'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన చేసి చాలా రోజులు గడుస్తున్నా.. మరో అప్డేట్ ఇవ్వలేదు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ఇందులో పలానా హీరోయిన్ నటిస్తుందని, పలానా హీరో నటిస్తున్నాడని, బాలీవుడ్ హీరోయిన్ చేస్తుందని ఇలా.. దీని గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
అడల్ట్ వెబ్ సిరీస్ 'గంధీబాత్' ఫేం అన్వేషీ జైన్ హాట్ ఫొటోలు
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా నటించబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఆమెను నిజంగానే సంప్రదించిందట. అయితే, ఆమె ఈ ఆఫర్ను తిరస్కరించిందని తెలిసింది. పలు ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపడం వల్ల డేట్స్ సర్ధుబాటు చేయలేని కారణంగా రష్మిక ఈ నిర్ణయం తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో మరో హీరోయిన్ను అన్వేషిస్తున్నారట దర్శక నిర్మాతలు. ఈ జాబితాలో జాన్వీ కపూర్ పేరు ఎక్కువగా ప్రచారం అవుతోంది.

ఇదిలా ఉండగా, క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పెడుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అలాగే, ఇటీవల దీనికి 'రాజా వచ్చినాడు' అనే పేరును కూడా అనుకుంటున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. అలాగే, ఈ మూవీలో కమెడియన్ సునీల్ విలన్గా నటిస్తున్నాడని అంటున్నారు. అలాగే, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రను పోషిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి.