Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
HIT హిందీ రీమేక్ మొదలు.. రాజ్కుమార్ రావ్తో శైలేష్ కొలను పిక్ వైరల్
మన తెలుగు కథలు వరుసబెట్టి బాలీవుడ్కు వెళ్తోన్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి, జెర్సీ, హిట్ వంటి సినిమా కథలన్నీ కూడా బాలీవుడ్కు పయనమయ్యాయి. ఇందులో అర్జున్ రెడ్డి.. కబీర్ సింగ్గా రీమేక్ అవ్వడం అందరికీ తెలిసిందే. కబీర్ సింగ్ బాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. దాదాపు మూడు వందల కోట్లు కొల్లగొట్టడంతో మన తెలుగు కథలకు గిరాకీ పెరిగింది. ఈక్రమంలోనే మరి కొన్ని కథలు అక్కడికి వెళ్లాయి.
జెర్సీ సినిమా కూడా హిందీలో రీమేక్ అయింది. షాహిద్ కపూర్ హీరోగా హిందీలో జెర్సీ షూటింగ్ కూడా పూర్తయింది. ఇక చిన్న సినిమాగా విడుదలైన HIT మూవీ తెలుగులో భారీ హిట్ అయింది. విశ్వక్సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. అందుకే ఈ మూవీని బాలీవుడ్లో రాజ్ కుమార్ రావును హీరోగా పెట్టి శైలేష్ కొలను డైరెక్ట్ చేసేందుకు సిద్దమయ్యాడు.
లాక్డౌన్ సమయంలో శైలేష్ కొలను హిట్ సినిమా రీమేక్ గురించి అధికారికంగా ప్రకటించాడు. తాజాగా రాజ్ కుమర్ రావును శైలేష్ కొలను కలిశాడు. ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ శైలేష్ కొలను ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతోందని తెలిపాడు. మొత్తానికి ఒక్క సినిమాతోనే బాలీవుడ్ ఆఫర్ను చేజెక్కించుకున్నాడు. ఇక ఈ మూవీ తరువాత హిట్ సీక్వెల్ను తెలుగులో తెరకెక్కించే అవకాశం ఉంది.