Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
మంచు విష్ణుతో సంజయ్ దత్.. ఆగని హాలీవుడ్ రూమర్లు
టాలీవుడ్లో సరైన హిట్టు కొట్టేందుకు ప్రయత్నిస్తున్న హీరోలలో మంచు విష్ణు ఒకరు. చాలాకాలంగా సక్సెస్ చేజిక్కించుకొని తెలుగు పరిశ్రమలో సత్తా చాటుకొనేందుకు విష్ణు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకొన్న ఓటరు సినిమా సంతృప్తిని ఇవ్వకపోవడంతో మళ్లీ ఏకంగా హాలీవుడ్, టాలీవుడ్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసి సంచలనం రేపాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్లో సంజయ్ దత్ కనిపించడం సెన్సేషనల్ వార్తగా మారింది. ఇంతకు మంచు విష్ణు సెట్లో సంజయ్ దత్ ఎందుకు కనిపించారంటే..
భారీ కుంభకోణం కథతో
కొన్నేళ్ల క్రితం దేశంలో చోటుచేసుకొన్న ఓ భారీ కుంభకోణం నేపథ్యంగా ఆంగ్ల, తెలుగు భాషల్లో ఓ ప్రాజెక్ట్కు భారీ ప్రణాళికను మంచు విష్ణు రచించారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ సెట్లోకి సంజయ్ దత్ రావడంతో అందరూ షాక్ అయ్యారు. దాంతోపాటు సంజయ్ రాకపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.
హాలీవుడ్ ప్రాజెక్టులో
ప్రస్తుతం కేజీఎఫ్ సీక్వెల్లో సంజయ్ దత్ నటిస్తున్నారు. బళ్లారిలో షూట్ చేయడానికి వీలు లేదని పిటిషన్ దాఖలు కావడంతో భారీ సెట్ వేసి ఈ సినిమాను ప్రస్తుతం హైదరాబాద్లో షూట్ చేస్తున్నారు. అయితే మంచు విష్ణు సినిమా షూట్ కూడా అదే ప్రాంతంలో జరగడంతో సంజయ్ దత్ సెట్స్ను సందర్శించారు. అలాగే తన మిత్రుడు సునీల్ శెట్టి కూడా ఉండటం కూడా ఆయన రాకకు ఓ కారణం కావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
సునీల్ శెట్టి కీలక పాత్రలో
అంతేకాకుండా సంజయ్ దత్ ఈ ప్రాజెక్టులో భాగమైనట్టు కూడా ఓ వార్త వైరల్ అయింది. అయితే ఈ విషయంపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో సునీల్ శెట్టి కీలక పాత్రను పోషిస్తున్నారు. ఆయన పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. ఈ ముగ్గురి కలయిక సందర్భంగా పలు విషయాలను చర్చించుకొన్నట్టు సమాచారం.
కాజల్, రుహానీ సింగ్ హీరోయిన్లుగా
మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ వయా మార్ ఎంటర్టైన్మెంట్, ఎవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రూపొందుతున్నది. ఈ చిత్రానికి మంచు విష్ణు భార్య విరోనికా మంచు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాజల్ అగర్వాల్, రుహాని సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.