మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' ట్రీట్.. క్రిస్మస్ స్పెషల్
మహేష్ బాబు తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రమోషన్స్ జోరుమీదున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్తగా అప్డేట్స్ ఇస్తూ సినిమా పట్ల మహేష్ అభిమానుల్లో ఉన్న ఆతృతను పెంచేస్తోంది చిత్రయూనిట్. ఇప్పటికే మండే సర్ప్రైజ్ పేరుతో గత కొన్నివారాలుగా స్పెషల్ ట్రీట్ ఇస్తూ వచ్చిన యూనిట్ సభ్యులు తాజాగా క్రిస్మస్ స్పెషల్ రిలీజ్ చేశారు.
మహేష్ అభిమానులకు, ప్రేక్షక లోకానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో హీరోయిన్ మహేష్ బాబు- రష్మిక మందన్న కనిపించిన లుక్ వావ్ అనిపిస్తోంది. ఎంతో క్యూట్ లుక్లో ఉన్న మహేష్ బాబును వెనుకనుంచి పట్టుకున్న రష్మిక ఆయన వైపు ప్రేమగా చూస్తున్నట్లుగా ఉన్న ఈ స్టిల్ మహేష్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది 'సరిలేరు నీకెవ్వరు' మూవీ. ఈ చిత్రంతో సీనియర్ హీరోయిన్ విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ట్రైన్ కామెడీ సీన్ హైలైట్ కానుందని తెలుస్తోంది. ఇందులో బండ్ల గణేష్ కామెడీ ఎపిసోడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని తెలుస్తోంది.
ఈ చిత్రానికి దిల్ రాజు, అనిల్ సుంకరలతో పాటు ఘట్టమనేని మహేష్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. భారీ అంచనాల నడుమ జనవరి 11న 'సరిలేరు నీకెవ్వరు' విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











