Just In
- 20 min ago
రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ రూమర్స్ అన్ని అబద్ధాలే!
- 31 min ago
బిగ్ బాస్ 5 మొదలయ్యేది ఎప్పుడంటే.. మరోసారి సోహెల్ కూడా..
- 1 hr ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 2 hrs ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
Don't Miss!
- News
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్: మొత్తం 4 దశల్లో, జనవరి 29 నుంచి ప్రక్రియ మొదలు
- Finance
ఒక్కరోజులో రూ.2.08 లక్షల కోట్ల సంపద హాంఫట్: 3 రోజుల్లో 1800 పాయింట్లు..
- Sports
ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే.. వాట్సన్ స్థానం అతనిదేనా?
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
యువ హీరో ఇంట్లో విషాదం.. కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన తండ్రి!
కరొనా వైరస్ కారణంగా మరో సెలబ్రెటీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎలాంటి తేడా లేకుండా అన్ని వర్గాల వారిని బలి తీసుకుంటున్న కరోనా వైరస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా చేదు అనుభవాలను కలిగిస్తోంది. ఈ రోజుల్లో సినిమా ద్వారా ఆడియెన్స్ కి పరిచయమైన యువ హీరో శ్రీ తండ్రి కరోనా కాటుకు బలయ్యారు. ఈ న్యూస్ ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసింది.

యువ హీరో ఇంట్లో విషాదం..
ఇటీవల పలువురు సీరియల్ యాక్టర్స్ కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. అయితే తగిన జాగ్రత్తలతో కొందరు ఆ వైరస్ నుంచి తప్పించుకుంటున్నారు. ఇక కొందరు సెలబ్రెటీలు ఊహించని విధంగా ప్రాణాలను విడుస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు యువ హీరో శ్రీ తండ్రి దుర్గా ప్రసాద్ కూడా వైరస్ కాటుకు బలయ్యారు.

ఈ రోజుల్లో హీరో..
శ్రీ అసలు పేరు శ్రీనివాస్ మంగం. 2012లో మారుతి తెరకెక్కించిన మొట్ట మొదటి సినిమా ఈ రోజుల్లో. అందులో హీరోగా నటించి శ్రీ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ తరువాత పలు డిఫరెంట్ సినిమాలతో ఆడియెన్స్ ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే కెరీర్ కి ఎంతగానో సపోర్ట్ చేసిన తండ్రి దురమవ్వడంతో శ్రీ తట్టుకోలేకపోతున్నాడు.

కరోనా పరీక్షల అనంతరం..
గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని విజయవాడ లోని ఒక హాస్పిటల్ జాయిన్ చేశాడు శ్రీ. మొదట నార్మల్ జ్వరం అనుకున్నప్పటికి కరోనా పరీక్షల అనంతరం పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆయనను బ్రతికించాలని వైద్యులు చివరి నిమిషం వరకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ దుర్గా రామ్ ప్రసాద్ ఆరోగ్యం సహకరీంచలేదు.

గత రాత్రి ప్రాణాలు కోల్పోయిన శ్రీ తండ్రి
కరోనా వైరస్ తీవ్రత ఎక్కువవ్వడంతో శ్రీ తండ్రి గత రాత్రి 8.30గంటలకు మృతి చెందినట్లు తెలుస్తోంది. కుటుంబ పెద్దగా ఉన్న తండ్రి మరణించడంతో యువ హీరో కుటుంబం ఒక్కసారిగా షాక్ కి గురైంది. యువ హీరో శ్రీ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. శ్రీ కుటుంబ సబ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక వారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు సన్నిహితులు తెలియజేశారు.