ప్రభాస్తో హీరోయిన్ గొడవ, అందుకే మాట్లాడటం లేదు!
‘ఏక్నిరంజన్’ మూవీలో ప్రభాస్ తో కలిసి నటించాను. షూటింగ్ సమయంలో ప్రభాస్కు, తనకు మధ్య ఓ చిన్న విషయంలో గొడజరిగింది. అప్పటి నుండి ప్రభాస్ తో మాట్లాడడం మానేశాను అని కంగనా తెలిపారు.
హైదరాబాద్: ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా టాప్ రేంజిలో ఉన్న కంగనా రనౌత్ గతంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఏక్ నిరంజన్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. కంగనా తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమా అది. ఆ సినిమా ప్లాప్ కావడంతో మళ్లీ ఆమె తెలుగులో కనిపించలేదు.
ఆ సినిమా తర్వాతి నుండి కంగనా, ప్రభాస్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. తాజాగా 'బాహుబలి-2' మూవీ చూసిన కంగనా..... ప్రభాస్ గురించి, ఆయనతో సినిమా చేసిన సమయంలో జరిగిన గొడవ గురించి చెప్పారు.

మాట్లాడటం మానేసాను
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ.... ‘ఏక్నిరంజన్' మూవీలో ప్రభాస్ తో కలిసి నటించాను. షూటింగ్ సమయంలో ప్రభాస్కు, తనకు మధ్య ఓ చిన్న విషయంలో గొడజరిగింది. అప్పటి నుండి ప్రభాస్ తో మాట్లాడడం మానేశాను అని కంగనా తెలిపారు.

ప్రభాస్ నటన అద్భుతం
బాహుబలి: ది కంక్లూజన్ సినిమా చూశాను. బాహుబలి పాత్రలో ప్రభాస్ నటన అద్భుతం. ఏక్నిరంజన్కు, ఇప్పటికి ప్రభాస్ ఎంతో ఇంప్రూవ్ అయ్యాడు. బాహుబలి లాంటి మూవీలో నటించిన ప్రభాస్ నటించినందుకు గర్వంగా ఉంది అని కంగనా తెలిపారు.

కంగనా నెక్ట్స్ మూవీ ‘మణికర్ణిక’... తెలుగు దర్శకుడు క్రిష్తో
క్రిష్ జాగర్లమూడి బాలీవుడ్లో మరో చారిత్రక చిత్రానికి శ్రీకారం చుట్టారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఆయన తెరెక్కించబోయే ‘మణికర్ణిక' మూవీ ప్రారంభోత్సవం ఇటీవల వారణాసి(కాశీ)లో జరిగింది... పూర్తి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి.



Click it and Unblock the Notifications











