Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కాటమ రాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ : పవన్ రెండు దశాబ్దాల జర్నీ పై ప్రోగ్రామ్
'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ ఫంక్షన్ రేపు సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్లో జరపడానికి మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు
'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ ఫంక్షన్ రేపు ఘనంగా జరపనున్నారు. ఈ వేడుకకి ఓ ప్రత్యేకత ఉందని చెప్పుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి 20 సంవత్సరాలైంది. విశేషమైన స్థాయిలో అభిమానుల మనసు దోచుకుంటూ రెండు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తిచేసిన సందర్భాన్ని హైలైట్ చేస్తూ ఈ వేడుక జరుపుదామని ఈ సినిమా టీమ్ చెప్పిందట. కానీ పవన్ మాత్రం గ్రాండ్ గావద్దనీ చాలా సింపుల్ గా జరిగిపోవాలని చెప్పటంతో అంతా కాస్త డిసప్పాయింట్ అయినట్టు సమాచారం.
ఈనెల 24న రిలీజ్ అవనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. ఇదిలావుంటే, రిలీజ్ డేట్ సమీపిస్తున్న తరుణంలో రేపు సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్లో ఓ ప్రి-రిలీజ్ ఈవెంట్ జరపడానికి మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.రెండు దశాబ్దాల తన నట ప్రయాణానికి సంబంధించిన విశేషాలతో ఓ ఏవీని చేయమనీ .. లేదంటే చిన్న ప్రోగ్రామ్ ఏదైనా చేయమని పవన్ చెప్పాడని అంటున్నారు. కనుక .. పవన్ 20 సంవత్సరాల కెరియర్ కి సంబంధించిన విశేషాలను ఆవిష్కరిస్తూ .. 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుందన్న మాట.
వివిధ న్యూస్ ఛానెల్స్తోపాటు పలు ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ ఈ ఈవెంట్ని ప్రత్యక్షప్రసారం చేయనున్నాయని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ పంక్షన్ని ప్రత్యక్షప్రసారం చేయనుంది. ఈమేరకు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానెల్ లింక్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.
కిషోర్కుమార్ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో నార్త్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శరత్మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ నాయికగా నటిస్తుండగా, ఇతర ప్రాతల్లో శివబాలాజీ, కమల్ కామరాజు, అజయ్, ఆలీ, నాజర్, రావు రమేష్, వేణుమాధవ్, తరుణ్ అరోరా, చైతన్యకృష్ణ, మణికంఠ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి ఛాయగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ, సంగీతం: అనూప్ రుబెన్స్, ఎడిటింగ్: గౌతంరాజు.