‘ఖైదీ నెం 150’ టీంకు ఐటీ రైట్స్ భయం పట్టుకుందా?
హైదరాబాద్: ఏదైనా స్టార్ హీరో సినిమా విడుదలైందంటే... అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా కలెక్షన్ల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఏ నిర్మాత కూడా కలెక్షన్ల వివరాలు ప్రెస్ మీట్ పెట్టిమరీ ప్రకటించిన సంఘటనలు చాలా అరుదు. చాలా మంది నిర్మాతలు సినీ నిర్మాణంలో ఎంతో కొంత బ్లాక్ మనీ వాడతారు, అందుకే ఎవరూ కలెక్షన్ల వివరాలను బయటకు చెప్పడానికి ఇష్టపడరు అనే టాక్ ఉంది.
అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150 చిత్రం వసూళ్ల వివరాలను ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. ఈ సినిమా నిర్మాణానికి వాడిన సొమ్మంతా కూడా వైట్ మనీ కావడంతో నిర్మాతలు వసూళ్లు వివరాలు కూడా దర్జాగా ప్రకటించారు. సినిమా తొలి వారం రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన సంగతి తెలిసిందే.
అంతా బాగానే ఉంది కానీ... ఈ వసూళ్ల ప్రటకన అంశం సినిమాకు పని చేసిన వారిని ఆందోళనకు గురి చేస్తోందట. 'ఖైదీ నెం 150' నిర్మాత వద్ద నుండి ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే వివారాలతో ఐటీ అధికారులు తమపై దాడులు చేస్తారనే భయంలో ఈ సినిమాకు పని చేసిన పలువురు టెక్నీషియన్స్, నటీనటులు భయ పడుతున్నారట.

ఫాస్టెస్ట్ 100 కోట్లు గ్రాసర్ ‘ఖైదీ నెం 150'... అల్లు అరవింద్ ప్రకటన
టాలీవుడ్లో ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాసర్ ‘ఖైదీ నెం 150' సినిమాయే అని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టిమరీ వెల్లడించారు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఓ వైపు సంక్రాంతి విన్నర్ ఎవరంటూ చర్చ.... శాతకర్ణి వైపే మొగ్గు!
ఈ సారి సంక్రాంతి బాక్సాఫీసు రేసు గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తికరంగా సాగుతోంచి. మెగాస్టార్ చిరంజీవి 150తో రీ ఎంట్రీ ఇస్తూ ‘ఖైదీ నెం 150' సినిమాతో.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సంక్రాంతికి వచ్చిన చిరు-బాలయ్య చిత్రాలపై మహేష్ కామెంట్
సంక్రాంతికి వచ్చిన చిరు-బాలయ్య చిత్రాలపై మహేష్ బాబు స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

దుర్మార్గుడు మావాడే అని చిరంజీవి చెప్పినా... ఇంకా వీడని అయోమయం!
150వ సినిమా చూసి పూర్తి సంతృప్తి చెందిన అభిమానుల ఆలోచనలు ఇపుడు 151, 152 వ సినిమాలు ఎవరితో చేయబోతున్నారు అనే దిశగా సాగుతున్నాయి.


Click it and Unblock the Notifications











