రెచ్చిపోయిన మెగా అభిమానులు... థియేటర్లో వీరంగం!
హైదరాబాద్: తమ అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానులు..... తీరా థియేటర్లోకి వచ్చిన తర్వాత షో ఆలస్యం కావడంతో తట్టుకోలేక పోయారు. దీంతో థియేటర్ మీద తమ ప్రతాపం చూపించారు.
గుంటూరు జిల్లా కొల్లూరులో బెనిఫిట్ షో ప్రదర్శన ఆలస్యం కావడంతో అభిమానులు థియేటర్ పై దాడికి దిగారు. నిన్న రాత్రే షో వేస్తామని నిర్వాహకులు టిక్కెట్లు అమ్మారు. అయితే తెల్లవారు జాము వరకు బెనిఫిట్ షో వేయకపోవడంతో ఖైదీ నెం 150 అభిమానులు శ్రీనివాస థియేటర్ పై దాడి చేసి కుర్చీలతో పాటు స్క్రీన్ లను కూడా ధ్వంసం చేసినట్టు సమాచారం.

శ్రీనివాస థియేటర్
శ్రీనివాస థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఈ పరిణామాలతో పోలీసులు రంగంలకి దిగి లాఠీ ఛార్జ్ కూడా చేసారని తెలుస్తోంది.

థియేటర్లో విధ్వసం
అభిమానులు థియేటర్లో విధ్వంసం సృష్టించిన ఫోటోలు ఇక్కడ చూడొచ్చు. ఈ పరిణామాలు అభిమానుల్లో సినిమాపై ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి నిదర్శనం.

బాహుబలికి చేరువలో ‘ఖైదీ నెం 150': రికార్డుల వేట షురూ...
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం 150' ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలలో గ్రాండ్ గా రిలీజైంది. యూఎస్ఏలో ప్రీమియర్ షోలతో ప్రారంభమైన ఖైదీ నెం 150... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రైతులు..రత్తాలు... రక్త సింధూరం (చిరు 'ఖైదీ నంబర్ 150' రివ్యూ)



Click it and Unblock the Notifications











