Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'మేముసైతం' అంటూ ఎంతిచ్చారు? డిటేల్స్
హైదరాబాద్ :విశాఖ హుద్హుద్ తుపాను బాధితుల కోసం తెలుగుసినీ పరిశ్రమ 'మేముసైతం' కార్యక్రమానికి విశేషస్పందన లభించింది. పలువురు ప్రముఖులు , సంస్థలు తుపాను బాధితులకు విరాళాలు ప్రకటించాయి. తుఫాను బాధితుల సహాయార్థం ఆదివా రం హైదరాబాద్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ‘మేము సైతం' భారీ కార్యక్రమాన్ని చిత్రసీమ నిర్వహించింది.
హుద్హుద్ తుపాను బాధితుల కోసం తెలుగుసినీ పరిశ్రమ నిన్నంతా మేముసైతం కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా పోగైన మొత్తాన్ని తెలుగు సినీ పరిశ్రమ ...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందచేసారు.
హుద్హుద్ తుఫాను బాధితులకు చేయూతనివ్వడానికి ముందుకు వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమ కనబరిచిన స్ఫూర్తి తప్పనిసరిగా సత్ఫలితాలనిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ‘మే ము సైతం' అంటూ చిత్ర పరిశ్రమ కదిలిన తీరును ఆయన ప్రశంసించారు.
టెలీకాస్ట్ చేయటం ద్వారా...
మేము సైతం పోగ్రామ్ ని టెలీకాస్ట్ చేయటం ద్వారా వచ్చిన మొత్తం -రూ3.5కోట్లుని సన్నెట్వర్క్ వారు అందచేసారు.
హిందూపురం నియోజకవర్గ ప్రజలు
బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నుంచి మంచి స్పందన వచ్చింది. అక్కడి వారు స్పందించి...అక్షరాలా ..రూ.43లక్షలు పోగుచేసి ఇచ్చారు.
బిగ్సి
టాలీవుడ్
పరిశ్రమతో
తొలినుంచి
అనుబంధం
పెంచుకుంటూ
వస్తున్న
బిగ్
సి
వారు...
యాడ్
లు
ఇచ్చి...మరీ
రూ.15లక్షలు
అందచేసారు.
మలబార్ గోల్డ్ అండ్ జ్యువెలరీ
అలాగే మలబార్ గోల్డ్ అండ్ జ్యూవెలరీ వారు కొన్ని పోగ్రామ్ లు స్పాన్సప్ చేసి మరీ...-రూ.13 లక్షలు అందచేసారు.
బాలకృష్ణ అభిమానసంఘం
తొలి నుంచి సామాజిక కార్యక్రమాలు అంటే ఉత్సాహం చూపిస్తూ వస్తున్న బాలకృష్ణ అభిమాన సంఘాలు..వారు సైతం ..మేము సైతం అంటూ...రూ1,11,111 అందచేసారు.
ఆశ్రా ఫౌండేషన్
అలాగే ... తుఫాన్ భాధితులను ఓదార్చటానికి ఆశ్రా పౌండేషన్ సైతం ముందుకొచ్చి...టాలీవుడ్ తో చేయికలిపింది. వారు రూ.10లక్షలు అందచేసారు.
మేముసైతం వెబ్సైట్ ద్వారా(ఇప్పటివరకు)
ఘనంగా నిర్వ హించిన మేము సైతం వెబ్ సైట్ ద్వారా సేకరించిన విరాళాలు...రూ.20లక్షలు వరకూ వచ్చాయి.
చంద్రబాబు మాట్లాడుతూ....
‘‘తెలుగువాళ్లు ప్రతి ఒక్కరూ స్పందించి తుఫాను కూడా అసూయపడేలా చేశారు. విశాఖకు తుఫానును బాగా నష్టం కలిగించింది. మీ అందరిలాగే నేనూ విశాఖపట్నాన్ని ప్రేమిస్తున్నా. దేశంలోని ఉత్తమ నగరాల్లో అదొకటి. తుఫాను తర్వాత మానవ ప్రయత్నంగా ఏం చెయ్యాలో అన్నీ చేశాం'' అని చంద్రబాబు చెప్పారు.
ఇందునిమిత్తం వేదికపైకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి తెలుగు సినీ ప్రముఖులు సాదరంగా స్వాగతం పలికారు. ఆయనకు రూ.11 కోట్ల 51 లక్షల 56116 రూపాయల చెక్కును అందించారు.
'మేముసైతం'
కార్యక్రమంలో
తుపాను
బాధితులకు
విరాళాలు
వివరాలు
ఈ
క్రింద
విధంగా
ఉన్నాయి.
స్లైడ్
షోలో...