దృశ్యం స్టోరీ
దృశ్యం సినిమా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇందులో వెంకటేష్, మీనా, నదియా , పరుచూరి వెంకటేశ్వరరావు, చలపతిరావు, సమీర్, రవి కాలె, సప్తగిరి నాయుడు, గోపి, రోషన్ బషీర్, ఉత్తేజ్, కాదంబరి కిరణ్, కాశీ విశ్వనాధ్, జోగినాయుడు, చిత్రం శ్రీను, చైతన్యకృష్ణ, బెనర్జీ, ప్రభు, ప్రసన్నకుమార్, అన్నపూర్ణమ్మ, సంధ్యాజనక్ తదితరులు నటించారు. ఈ సినిమాకి నిర్మాత డి సురేష్బాబు, రాజ్కుమార్ సేతుపతి, సమర్పణ: డి రామానాయుడు మరియు శ్రీ ప్రియ దర్శకత్వం లో నిర్మించారు.ఈ చిత్రానికిసంగీతం: శరత్ అందించారు కథ తన ఊళ్లో కేబుల్ నడుపుకుంటున్న రాంబాబు(వెంకటేష్) కి తను చూసే సినిమాలు, తన భార్య(మీనా) పిల్లలే లోకం. తన జీవితంలో వచ్చే సమస్యలకు తను చూసిన సినిమాల్లోంచే పరిష్కారాలు వెతుక్కునే అతను ఊహించని సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. అతని కుమార్తె అంజు బట్టలు మార్చుకునేటప్పడు...సెల్ లో వీడియో తీసి వరుణ్ అనే కుర్రాడు బ్లాక్ మెయిల్ చేస్తూంటాడు. దాన్ని నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో వాడు..అంజు చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. వరుణ్ ... ..పోలీస్ ఐజీ గీతా ప్రభాకర్ (నదియా) కొడుకు. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు ఏం చేసాడు. ఏ విధంగా ప్లాన్ లు వేసి , తన కుటుంబాన్ని వేటాడటానికి సిద్దమైన పోలీస్ డిపార్టమెంట్ నుంచి కాపాడుకున్నాడు అనేది ఉత్కంట కలిగించే కథనం.
Read More