యాంకర్ అనసూయ జోరు, మెగాస్టార్ చిరంజీవి బేజారు... లోపం ఎక్కడ?
అనసూయ షో తెస్తున్న రేటింగ్ష్ కూడా మెగాస్టార్ చిరంజీవి ఎంఇకె షోకు రావడం లేదట.
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై వైపు వస్తారని దాదాపు ఎవరూ ఊహించి ఉండరు. పరిస్థితులు కలిసిరావడమో...? అభిమానుల కోరిక ఫలించడమో తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవిని మొత్తానికి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు.
చిరంజీవి హోస్ట్ గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' నాలుగవ సీజన్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. షో విజయవంతంగా సాగుతున్న ఆశించిన రేటింగ్స్ మాత్రం రావడం లేదు. చివరకు అనసూయ షో తెస్తున్న రేటింగ్స్ కూడా మెగాస్టార్ చిరంజీవి ఎంఇకె షోకు రావడం లేదట.

చిరంజీవి షోకు రేటింగ్ ఎంత..
మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా మాటీవలో ప్రసారం అవుతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకు చాలా నార్మల్ రేటింగ్ వచ్చిందని, కేవలం 5.80 కేటింగ్ రాబట్టిందని తెలుస్తోంది. చిరంజీవి రీ ఎంట్రీ సినిమాకు భారీ స్పందన వచ్చింది. అయితే బుల్లితెరపై ఆ మ్యాజిక్ పని చేయలేదే.

అనసూయ జాక్ పాట్
ఇక అనసూయ హోస్ట్ గా జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ‘జాక్ పాట్' షోకు మంచి రేటింగ్ వస్తోందట. ఈ షోకు 6.5 రేటింగ్ వచ్చిందని తెలుస్తోంది.

ఆలోచనలో పడ్డ టీం
అయితే చిరంజీవి షోకు ఇంత తక్కువ రేటింగ్ రావడంపై షో నిర్వాహకులు ఆలోచనలో పడ్డారు. లోపం ఎక్కడ ఉంది? రేటింగ్స్ పెంచాలంటే ఏం చేయాలి? ఎవరెవరిని గెస్టులుగా ఆహ్వానించాలి అనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారట.

చిరంజీవి, పవన్ కళ్యాణ్తో మల్టీస్టారర్ నిజమే: వివరాలు ఇదిగో...
మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్కల్యాణ్లతో త్వరలోనే ఓ మల్టీస్టారర్ చిత్రం చేయనున్నట్లు నిర్మాత, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి మరోసారి స్పష్టం చేసారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

పెళ్లి వేడుకలో చిరంజీవి-బాలయ్య ఎఫెక్షన్ చూసారా? (ఫోటోస్)
ప్రముఖ తెలుగు సంగీత దక్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి వివాహం ప్రత్యూషతో బుధవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో బాలయ్య, చిరంజీవి సందడి చేసారు. పూర్తి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి.

చిరంజీవి తర్వాత జూ ఎన్టీఆరే అంటూ ప్రచారం: ఈ పుకార్ల వెనక ఎవరు?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్స్' సంస్థను స్థాపించి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తన తండ్రి తర్వాత ఎన్టీఆరే అని డిసైడ్ అయ్యారట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











