Don't Miss!
- News జగన్ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రభాస్కు దెబ్బ మీద దెబ్బ.. నాగ్ అశ్విన్ మూవీపై రూమర్లు.. అసలేం జరుగుతున్నదంటే!
లాక్డౌన్ తర్వాత జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. కరోనావైరస్ కారణంగా ప్రభాస్ నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నది. వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ సత్తాను చాటాలన్న ప్రభాస్ దూకుడుకు అడ్డుకట్ట పడుతున్నది. తాజాగా ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించిన ఓ వార్త మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వార్త వివరాల్లోకి వెళితే..
ప్రియుడిని వదిలేసి.. పెంపుడు కుక్కతో రోడ్డెక్కిన హాట్ బ్యూటీ మలైకా అరోరా
ప్యాన్ ఇండియా మూవీస్తో
సాహో తర్వాత ప్రభాస్ ఎంపిక చేసుకొన్న సినిమాలను చూస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే. దేశంలోనే ఏ హీరో కూడా చేయని సినిమాలను యంగ్ రెబల్ స్టార్ చేయడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ప్రభాస్ చేసే అన్ని సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలే కావడం అందుకు ప్రధాన కారణమైంది.
వాయిదా పడ్డ ప్రభాస్ సినిమాలు
రాధే శ్యామ్ సినిమాను సెట్స్పైనే పెట్టేసి.. లైన్లోకి సలార్, ఆదిపురుష్ సినిమాలను తెరపైకి తెచ్చారు. ఏకకాలంలో రాధేశ్యామ్, సలార్, ఆది పురుష్ సినిమాల షూటింగులతో బిజీగా మారారు. ప్రభాస్ దూకుడు కొనసాగుతుండగా కరోనావైరస్ గట్టిగా దెబ్బ వేసింది. దాంతో ప్రభాస్ స్ట్రాటజీకి కొంత ఇబ్బందిగా మారింది.
ప్రభాస్ ఆందోళనతో
ప్రభాస్ సినిమా సెట్లో పలువురు కరోనావైరస్ బారిన పడటంతో సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. తన సినిమా యూనిట్లో పనిచేసే సిబ్బంది, టెక్నిషియన్స్, నటీనటులు ప్రాణాలను పణంగా పెట్టలేనని ప్రభాస్ స్పష్టం చేయడంతో సినిమాలు వాయిదా వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
నాగ్ అశ్విన్ సినిమాపై దెబ్బ
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో 2021లో ప్రభాస్ చేసుకొన్న ప్లానింగ్ అంతా డిస్ట్రబ్ అయినట్టు కనిపిస్తున్నది. ఈ మూడు సినిమా షూటింగుల క్యాన్సిల్ కావడం త్వరలో ప్రారంభమయ్యే నాగ్ అశ్విన్ సినిమాపై దెబ్బ పడింది. ఈ సినిమాను జూలైలో ప్రారంభించాలని నాగ్ అశ్విన్ గట్టిగా ప్లాన్ చేశారు. ఈ మేరకు యాక్షన్, విజువల్ ఎఫెక్ట్ టీమ్తో పనిచేస్తూ, ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకొంటున్నారు.
Recommended Video
అక్టోబర్లో ప్రభాస్, నాగ్ అశ్విన్ మూవీ
ప్రభాస్ ఇతర సినిమాల కాల్షిట్స్ డిస్ట్రబ్ కావడంతో నాగ్ అశ్విన్ సినిమా కూడా ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నది. కోవిడ్ కారణంగా ప్రభాస్, దీపికా పదుకోన్ నటించే సినిమా షెడ్యూల్స్ అంతా అస్తవ్యస్తంగా మారాయి. ఈ నేపథ్యంలో తన సినిమాను అక్టోబర్లో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీపిక పదుకోన్కు సంబంధించిన పఠాన్ సినిమా కూడా వాయిదా పడటంతో డేట్స్ సమస్య తలెత్తే అవకాశం లేకపోలేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.