Don't Miss!
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అమీషా పటేల్ ఫోటోలు చూపించి బెదిరింపులు.. 2.5 కోట్ల చీటింగ్!
హాట్ బ్యూటీ అమీషా పటేల్ తెలుగు సినీ అభిమానులకు కూడా సుపరిచయమే. బద్రి, నాని, నరసింహుడు, పరమవీర చక్ర లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం అమీషా పటేల్ కు సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. అప్పుడప్పుడూ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అమీషా తన బికినీ ఫొటోలతో హాట్ టాపిక్గా మారింది. తరచుగా అమీషా పటేల్ వివాదాల్లో సైతం నిలుస్తోంది. ఆ మధ్యన ఓ రాజకీయ పార్టీకి సోషల్ మీడియాలో ప్రచారం కల్పించేందుకు పలువురు బాలీవుడ్ తరాలు బేరం కుదుర్చుకుంటున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో అమీషా పటేల్ కూడా ఉంది. ఆ వివాదం మరచిపోకముందే అమీషా పటేల్ మరోమారు వార్తల్లో నిలిచింది.
తగ్గిన అవకాశాలు
అమీషా పటేల్ కు బాలీవుడ్ లో అవకాశాలు బాగా తగ్గాయి. దీనితో చిత్ర నిర్మాణ రంగంలో రాణించాలని అమీషా ప్రయత్నాలు మొదలు పెట్టింది. తాను ప్రధాన పాత్రలో నటిస్తూ దేశీ మ్యాజిక్ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి కునాల్ గూమార్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడో కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూనే ఉంది. ఈ చిత్రం విషయంలోనే అమీషా పటేల్ తాజాగా చిక్కుల్లో చిక్కుకుంది.
ఏం జరిగిందటే
ఈ చిత్రాన్ని నిర్మించేందుకు అమీషా పటేల్, కునాల్ గూమార్కు ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అజయ్ కుమార్ సింగ్ 2.5 కోట్ల ఆర్ధిక సాయం చేశారు. కానీ సినిమా ఎంతకు విడుదల కాకపోవడం, వీరిద్దరూ తన అప్పు చెల్లించక పోవడంతో అజయ్ కుమార్ అసహనానికి గురయ్యాడు. దేశీ మ్యాజిక్ చిత్రాన్ని 2018లోనే విడుదల చేస్తాం అని, మరిన్ని లాభాలు వస్తాయని చెప్పారు. లాభాల్లో తనకు కూడా వాటా ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ సినిమా 2018లో విడుదల కాలేదు.
3 కోట్ల చెక్
ఇక ఈ చిత్రం విడుదల కోసం తాను ఎదురుచూడలేక అమీషా, కునాల్ని ఇటీవల తాను రాంచీలో కలిశా. వారిద్దరూ నాకు 3 కోట్ల చెక్ ఇచ్చారు. కానీ ఆ చెక్ బౌన్స్ అయింది. ఇదేంటని అడగగా తమకు డబ్బు చెల్లించే ఉద్దేశం లేదని, చేతనైంది చేసుకో అంటూ అమీషా, కునాల్ బెదిరింపులకు దిగుతున్నట్లు అజయ్ కుమార్ మీడియా ముందు వాపోయారు. అమీషా, కునాల్కు బుద్ది చెప్పేందుకు కోర్టులో కేసు నమోదు చేసినట్లు అజయ్ కుమార్ తెలిపారు.
ఫోటోలు చూపించి
కేసు నమోదు చేసిన తర్వాత కూడా అమీషా, కునాల్ నుంచి తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని అజయ్ కుమార్ పేర్కొన్నారు. అమీషా పటేల్ కొంతమంది ప్రముఖులతో దిగిన ఫోటోలు చూపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. మొత్తంగా ఈ వివాదం అమీషా పటేల్ మెడకు గట్టిగానే చుట్టుకునేలా ఉంది.