Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
థియేటర్లకు పూర్వ వైభవం: చిత్ర ప్రదర్శనకు సర్వం సిద్ధం
తెలంగాణాలో ఎట్టకేలకు సినీ ప్రియుల ఎదురుచూపులకు తెరపడబోతోంది. డిసెంబర్ 4 నుంచి సినిమా ప్రదర్శనల నిమిత్తం థియేటర్లను తెరిచేందుకు రంగం సిద్ధమవుతోంది. దీంతో ఇటు సినీ అభిమానులతో పాటూ, చిత్ర పరిశ్రమలోనూ నూతనోత్సాహం తొణికిసలాడుతోంది.
తెరచుకోనున్న సినిమా హాళ్లు
కోవిడ్ 19 నియమ నిబంధనల పాటిస్తూ సినిమా హాళ్లను తెరవవచ్చునని గతంలోనే తెలంగాణా ప్రభుత్వం వెల్లడించిన సంగతి విదితమే. అయితే, థియేటర్ యజమానుల సంఘం పలు దఫాల చర్చలు జరిపి డిసెంబర్ 4 నుంచి థియేటర్లను చిత్ర ప్రదర్శనకు సిద్ధం చేయాలని నిర్ణయించింది.
చిత్ర ప్రదర్శనకు సర్వం సిద్ధం
టికెట్ ధరను తమ పరిస్థితులకు అణుగుణంగా నిర్ణయించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించినప్పటికీ, ధరలను యధాతథంగా కొనసాగించాలనే థియేటర్ల యాజమాన్యం నిర్ణయించుకుంది. ప్రేక్షకుల సౌకర్యం, రక్షణే ప్రస్తుతం తమ ప్రధాన లక్ష్యమని ఎగ్జిబిటర్లు పేర్కొన్నారు.
ప్రేక్షక స్పందనపై సర్వత్రా ఆసక్తి
సినిమాలను విడుదల చేయాలనుకునే నిర్మాతలకు... ప్రచారానికి, బజ్ క్రియేట్ చేయడానికి కాస్త సమయం పడుతుంంది కాబట్టి, ముందు నుంచే హాళ్లను అందుకు సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సానిటైజింగ్ పై థియేటర్లు యాజమాన్య ప్రత్యేక దృష్టి సారించింది.
Recommended Video
50శాతం సీటింగ్
అయితే ప్రభుత్వం 50శాతం సీటింగ్ కు మాత్రమే అనుమతి ఇవ్వడంతో ప్రేక్షకులు నుంచి ఏ విధమైన స్పందన లభిస్తుందన్నదానిపై ఎగ్జిబిటర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆడియన్స్ రెస్పాన్స్ బట్టే రోజుకు ఎన్ని షోలు వేయాలన్నదానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఏమైనా కలెక్షన్ల ఆధారంగానే ఎగ్జిబిటర్లు, నిర్మాతల భవిష్యత్తు ఆధారపడి ఉండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.