Don't Miss!
- News జగన్ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఓ వైపు నవ్వించారు.. మరో వైపు ఏడిపించేశారు.. ఆ కమెడియన్లకు నివాళి
ప్రతీ పండుగలకు ఈటీవీలో మల్లెమాల వారు, జబర్దస్త్ ఆర్టిస్ట్లందిరూ కలిసి ఓ స్పెషల్ ఈవెంట్లు చేస్తుంటారు. ప్రతీ పండుగకు కొత్త కొత్త కాన్సెప్ట్లను తీసుకొస్తారు. అందరిక కంటే భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తారు. ఇంత వరకు తెర మీదకు రాని వారిని తీసుకొచ్చి ఎమోషనల్ అయ్యేలా చేస్తారు. ఓ జబర్దస్త్ ఫ్యామిలీ, వాళ్ల బ్యాక్ గ్రౌండ్తో ఈవెంట్ చేశారు. మరోసారి కష్టపడి ఎదిగిన వారిని ఇలాంటి ఈవెంట్ల ద్వారా అందరికీ మరోసారి పరిచయం చేస్తుంటారు. మ్యాజిక్ విన్యాసాలు, మ్యూజిక్ బ్యాండ్లు ఇలా అందర్నీ తీసుకొస్తుంటారు.
ఈ సారి కూడా..
దసరాకు జబర్దస్త్ ఆర్టిస్ట్లందరూ కలిసి అక్కా ఎవరే అతగాడు అనే ఈవెంట్ను ప్లాన్ చేశారు. ప్రతీ సారి రోజా స్పెషల్ అట్రాక్షన్గా ఉండేది. కానీ ఈసారి మాత్రం ఆమె స్థానంలో సంగీతను తీసుకొచ్చారు. నవదీప్, శేఖర్ మాస్టర్, రష్మీ, వర్షిణి ఇలా అందరూ స్పెషల్ ఎంట్రీలు ఇచ్చారు.
డిఫరెంట్ కాన్సెప్ట్..
అయితే ఈ ఈవెంట్లో కేవలం ఫన్ మాత్రమే కాదు ఓ మెసెజ్ కూడా ఇవ్వబోతోన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్లో మనం చాలా మంది కమెడియన్లు కోల్పోయాం. ఈ మధ్య కాలంలోనే జయప్రకాష్ రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ తరపు కమెడియన్లను గుర్తుకు తెచ్చే విధంగా ఓ స్కిట్ చేశారు.
వారి ఫ్యామిలీలు కూడా..
ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం ఎస్ నారాయణ, ఏవీఎస్, వేణు మాధవ్, జయప్రకాష్ రెడ్డి, కొండవలస ఇలా కమెడియన్లకు డూప్లు గెటప్లు వేసుకొచ్చి వారి మనోభావాలను తెలిపాడు. ఈ దివంగత కమెడియన్ల అంతరంగాలను, సదరు కమెడియన్ల కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా చూపించాడు.
కన్నీరు పెట్టేశారు..
మామూలుగా కమెడియన్లను ఎవ్వరూ పట్టించుకోరని, వారు చనిపోయినా, వారి ఫ్యామిలీల గురించి ఎవ్వరూ పట్టించుకోరని, ఇలా మమ్మల్ని గుర్తు పెట్టుకుని పిలిచినందుకు థ్యాంక్స్ అని కమెడియన్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషనల్ అయ్యారు. జయప్రకాష్ రెడ్డి, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గెటప్ వేసుకున్న ఆర్టిస్ట్లు నిజంగానే ఏడిపించేశారు. ఇక వేణు మాధవ్ అబ్బాయి స్టేజ్ మీదనే కన్నీరు పెట్టుకున్నాడు.