Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇండియన్ సినిమాలోనే సరికొత్త పేజీకి శ్రీకారం.. సైరాలో ఎవరెవరు ఏయే పాత్రలో అంటూ యాంకర్ సుమ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై మెగా పవర్స్టార్ రామ్చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సైరా ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు పెద్ద ఎత్తున మెగా అభిమాన వర్గం తరలి వచ్చారు. ఎల్బీ స్టేడియం అంతా మెగా అభిమానులతో కిటకిటలాడుతోంది. ఈ వేడుకకు సుమ హోస్ట్గా వ్యవహరిస్తూ సైరా విశేషాలు చెబుతోంది. ఈ మేరకు సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఎవరెవరు ఏయే క్యారెక్టర్స్ చేస్తున్నారో తెలిపింది సుమ.
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి, గోసాయిగా వెంకన్నగా అమితాబ్ బచ్చన్, సిద్దమ్మగా నయనతార, లక్ష్మీగా తమన్నా, అవుకురాజుగా కిచ్చ సుదీప్, రాజాపాండీగా విజయ్ సేతుపతి, వీరారెడ్డిగా జగపతిబాబు, వసి రెడ్డిగా రవి కిషన్ నటిస్తున్నారని, ఇంతమంది తారాగణంతో ఇండియన్ సినిమాలోనే సరికొత్త పేజీకి శ్రీకారం చుట్టింది సైరా నరసింహా రెడ్డి అంటూ తన మాటలతో వేదిక ప్రాంగణాన్ని హోరెత్తించింది యాంకర్ సుమ.