Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘నిన్ను కలవాలనుంది’ అంటూ జాహ్నవి కపూర్కు లెటర్
అందాల నటి శ్రీదేవి కూతురిగా పరిచయమైనా.. తనకంటూ ప్రత్యేక గుర్తుంపును తెచ్చుకుంది జాహ్నవి కపూర్. తల్లి బతికున్నప్పుడే తన వ్యవహార శైలితో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అందంలో తల్లికి ఏమాత్రం తీసిపోనంతగా ఉండే ఈ అమ్మడు.. తొలి సినిమాలోనే నటనతో మెప్పించి విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ఈ ఊపులోనే మరికొన్నిసినిమాలకూ సంతకాలు చేసేసింది. ఇప్పుడు ఆ సినిమా షూటింగులో పాల్గొంటోంది.
భారీ ఫ్యాన్ ఫాలోయింగ్
పేరుకు శ్రీదేవి కూతురే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడంతో జాహ్నవికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆమె సినిమా విడుదలవక ముందే జాహ్నవి పేరిట ఎన్నో ఫ్యాన్ పేజీలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అంతేకాదు, ఆమె ఎక్కడ షూటింగ్ చేస్తున్నా.. సదరు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో అక్కడకు వాలిపోతున్నారట. గతంలో తన ఫ్యాన్స్ వల్లే జాహ్నవి ఇబ్బందులు పడిన సందర్భాలూ ఉన్నాయి.
ఫ్యాన్స్ నుంచి లేఖలు
ప్రస్తుతం తన కొత్త సినిమా ‘రూహీ అఫ్జా' షూటింగ్ కోసం జాహ్నవి మనాలిలో ఉంటోంది. ఈ సమయంలో ఆమెకు యువ ఫ్యాన్స్ నుంచి ఎన్నో లేఖలు వస్తున్నాయట. ఇందుకు సంబంధించిన ఓ లేఖ మీడియా కంట పడింది. ‘‘హాయ్ జాహ్నవి మేడమ్. ఎంత వీలైతే అంత తొందరగా మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము. మేమంతా మీకు పెద్ద ఫ్యాన్స్. మిమ్మల్ని కలవడం కోసం మేమంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం'' అని అందులో ఆమె అభిమానులు పేర్కొన్నారు.
ప్రస్తుతం చేస్తున్న సినిమా
జాహ్నవి కపూర్ ప్రస్తుతం ‘రూహీ అఫ్జా' అనే సినిమా చేస్తోంది. హార్ధిక్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దినేష్ విజన్, లంబా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్కుమార్ రావు లీడ్ రోల్ చేస్తుండగా, వరుణ్ శర్మ, రోహిత్ రాయ్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 మార్చిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.