Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అక్కినేని హీరోతో గోపిచంద్ ఫైట్.. నితిన్ కూడా రాబోతున్నాడా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ కి సిద్దమైన సినిమాలు చాలానే ఉన్నాయి. కరోనా వైరస్ దెబ్బకు గత ఆరు నెలల నుంచి థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే థియేటర్స్ ఓపెన్ చేసినా కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే. ఎందుకంటే గతంలో మాదిరిగా అయితే బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించదు.
అందుకే పూర్తిగా పరిస్థితి చక్కబడిన తరువాతే రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేయాలని కొంతమంది హీరోలు ఓపిక పడుతున్నారు. అయితే కాలం మీద నమ్మకంతో కొందరు హీరోలు ఇప్పటి నుంచే రిలీజ్ డేట్స్ బయటపెట్టేస్తున్నారు. ఇప్పటికే అక్కినేని హీరో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ లో నితిన్, గోపీచంద్ కూడా తలపడనున్నట్లు తెలుస్తోంది.
నితిన్ అంటే భీష్మ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు. కానీ గోపిచంద్ గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. దీంతో ఎలాగైనా సీటిమార్ సినిమాతో సక్సెల్ కొట్టాలని సంక్రాంతిని టార్గెట్ చేశాడు. ఆ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ తో కలిసి అఖిల్ మొదటి సక్సెస్ ని చూడాలని ఒక రొమాంటిక్ సినిమాతో రెడీ అయ్యాడు. మరి వీరి ముగ్గురిలో ఎవరు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంటారో చూడాలి.