Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'సరిలేరు నీకెవ్వరు' మండే సర్ప్రైజ్.. అదరగొట్టేస్తున్న మూడో పాట
ఎప్పటిలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు మరో మండే సర్ప్రైజ్ ఇచ్చారు. తన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్స్ కోసం వినూత్నంగా అప్డేట్స్ ఇవ్వడం ప్రారంభించిన మహేష్.. గత రెండు సోమవారాలు రెండు పాటలు రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే బాటలో మళ్ళీ ఈ సోమవారం (డిసెంబర్ 16) మరో పాటను ప్రేక్షకుల ముందుంచారు.
హి ఈజ్ సో క్యూట్ అంటూ సాగిపోతున్న ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా, మధుప్రియ ఆలపించింది. మహేష్ బాబు అందాన్ని పొగుడుతూ సాగిపోతున్న ఈ పాట సూపర్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకి తోడు ఈ సాంగ్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.
ఇప్పటి వరకు విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' అప్డేట్స్ చూస్తుంటే ఈ సినిమా మహేష్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుందని తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునేలా కామెడీ సన్నివేశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది.
'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతోనే వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.