Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పీవీ సింధుకి నాగార్జున బహుమతి.. చాలా కాస్ట్లీ గురూ!
Recommended Video
అంతర్జాతీయ బ్యాట్మింటన్ పోటీల్లో తెలుగు తేజం పీవీ సింధు విశేష ఖ్యాతి తెచ్చుకుంటోంది. గతంలో అనేక పతకాలు చేజిక్కించుకొని తన టాలెంట్ చూపించిన ఈమె.. ఇటీవలే జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో స్వర్ణం గెలిచి భారత దేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసింది. దీంతో దేశంలోని ప్రముఖులంతా ఆమెను అభినందిస్తూ శుభాకాంక్షలు వెల్లువెత్తించిన సంగతి తెలిసిందే.
పీవీ సింధు ప్రతిభకు గుర్తింపుగా..
ఈ నేపథ్యంలో ఆమె ప్రతిభకు గుర్తింపుగా ఓ విలువైన బహుమతిని అందించారు హీరో నాగార్జున. క్రీడల్లో ప్రతిభ చూపుతున్న అథ్లెట్స్కి గత కొంతకాలంగా చాముండేశ్వరినాథ్ విలువైన కార్లని బహూకరిస్తున్న విషయం తెలిసిందే. కార్పొరేట్ సంస్థలు, కొద్ది మంది స్నేహితులతో కలిసి అతను ఈ విధంగా క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నారు.
నాగార్జున చేతుల మీదుగా
ఈ మేరకు ఈ రోజు (సెప్టెంబర్ 14) అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన కార్యక్రమంలో బీఎండబ్ల్యూ కారును అందజేశారు. నాగార్జున చేతుల మీదుగా ఈ కారు బహుకరించబడటం విశేషం. చాముండేశ్వరినాథ్ ఇప్పటి వరకూ ప్రతిభ కనర్చిన క్రీడాకారులకు 22 కార్లని అథ్లెట్స్కి బహూకరించగా.. ఇందులో ఏకంగా 4కార్లు పీవీ సింధుకే దక్కడం మరో విశేషం.
పీవీ సింధుపై ప్రశంసల వర్షం
ఈ సందర్భంగా నాగార్జున కాసేపు మీడియాతో మాట్లాడిన నాగార్జున పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురిపించారు. తాను పీవీ సింధుకి పెద్ద అభిమానని తెలిపారు. ఆమె తనకు వ్యక్తిగతంగా తెలుసని, ఈ విషయం చెప్పడానికి గర్వపడుతున్నానని ఆయన అన్నారు.
కోచ్ గోపీచంద్కి అభినందనలు
దేశానికి ఛాంపియన్లని అందిస్తున్న కోచ్ గోపీచంద్కి అభినందనలు అని పేర్కొన్నారు నాగార్జున. సింధు తల్లిదండ్రులు (పీవీ రమణ, విజయ) దేశానికి ఓ అద్భుతమైన ఛాంపియన్ని అందించారని ఆయన అన్నారు. ఇక తన ప్రతిభను గుర్తిస్తూ ఈ కారును బహుకరించడం పట్ల తన ఆనందం వ్యక్తం చేసింది పీవీ సింధు.
మరికొద్ది రోజుల్లో బయోపిక్
మరోవైపు తెలుగు తేజం పీవీ సింధు బయోపిక్ రూపొందించేందుకు పనులు వేగవంతం చేశారని తెలుస్తోంది. ఈ బయోపిక్లో సమంత గానీ, దీపికా పదుకొనె గానీ లీడ్ రోల్ పోషిస్తుందని టాక్ నడుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే దీనిపై అఫీషియల్ సమాచారం రానుందని తెలుస్తోంది.