Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వారిద్దరూ కూటికోసం కష్టపడ్డారు : ఇళయరాజా
చెన్నై : 'వారిద్దరూ ఇప్పటికీ స్నేహితులుగా సంతోషంగా ఉన్నారనే విషయం నాకెంతో ఆనందంగా ఉంది. ఒకప్పుడు వారు చెన్నైలోని పాండిబజార్లో ఒక్కపూట కూటి కోసం కష్టపడేవారు. ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నారు. ఆఖరకు చిత్ర పరిశ్రమలో స్టార్లుగా ఎదిగారు. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నార'ని సూపర్స్టార్ రజనీకాంత్, మోహన్బాబుల స్నేహం గురించి 'ఇసైజ్ఞాని' ఇళయరాజా అన్నారు.
మంచు ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆది, తాప్సీ, లక్ష్మీప్రసన్న నటిస్తున్న చిత్రం 'గుండెల్లో గోదారి'. ఈ సినిమా తమిళంలో 'మరందేన్ మన్నిత్తేన్' పేరిట విడుదల కానుంది. ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం నగరంలో జరిగింది. ఇందులో నటుడు మోహన్బాబు, సంగీత దర్శకుడు ఇళయరాజా, ఆది, విష్ణు, మనోజ్, తాప్సీ, లక్ష్మీప్రసన్న, కాట్రగడ్డ ప్రసాద్, రవిరాజా పినిశెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇళయారాజా మాట్లాడుతూ.. మూడు స్వరాలతో రూపొందించిన ఓ పాట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. తన జీవితంలో ఎదురైన సంఘటనలు కూడా ఈ చిత్రంలో చొప్పించడం జరిగిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం తనకు మార్కెట్ పెరిగిందన్న వ్యాఖ్యలపై ఇళయరాజా స్పందిస్తూ.. 'అసలు ఈ సంగీతానికి నేనే తెర. ఆ బాట వేసింది నేనే. తెరలేకుండా ఏ సినిమానూ చిత్రీకరించలేం. అలాంటి నాకు మార్కెట్ పెరగడం ఏంట'ని తనదైన శైలిలో వివరించారు. మోహన్బాబు మాట్లాడుతూ.. చిత్రరంగంలో నిలదొక్కుకోవడం కోసం ఇక్కడే అహర్నిశలు శ్రమించామని గుర్తుచేసుకున్నారు. ఈ గడ్డలోనే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని చెప్పారు. తెలుగు చిత్రసీమ తనకు జీవితానిచ్చిందని తెలిపారు.
ఆది పనిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి, సుదీప్ కిషన్ ముఖ్య పాత్ర ధారులుగా రూపొందుతున్న చిత్రం 'గుండెల్లో గోదారి'. ఈ చిత్రం కథ గురించి హీరో ఆది పనిశెట్టి మాట్లాడుతూ -''దివిసీమ ఉప్పెనల నేపథ్యంలో సాగే కథాంశం ఇది. ఈ కథలో అంతర్లీనంగా రెండు ప్రేమకథలుంటాయి. నేను, తాప్సీ ఓ జంట అయితే... నేను, లక్ష్మీప్రసన్న మరో జంట. అందుకని ఇది ముక్కోణ ప్రేమకథకాదు. ఇద్దరితో నేను సాగించే ప్రేమాయణం ఆసక్తికరంగా ఉంటుంది'' అని హీరో ఆది చెప్పా రు.
1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు. ముమైత్ ఖాన్ ఐటం సాంగు చేస్తోంది. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు.