Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అద్భుతం...మళ్లీ మళ్లీ చూస్తా : శింబు
చెన్నై : '''వీరం' చూశాను... అద్భుతం... మళ్లీ మళ్లీ చూస్తాను''అని అజిత్పై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు శింబు. యువ నటుడు శింబు అజిత్కు వీరాభిమాని అన్న విషయం విదితమే. అజిత్ నటించిన ప్రతి చిత్రాన్ని విడుదల రోజే చూడటం శింబు అలవాటు. 'ఆరంభం' విడుదల సందర్భంగా నగరంలోని కాశీ థియేటర్లో తొలి షోనే చూశాడు శింబు.
అయితే ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్లో ఉన్న కారణాన 'వీరం' చూడలేకపోయాడట. అయితే రెండు రోజుల ముందుగానే ఆయన వీక్షించాడట. దీనిపై ట్విట్టర్లో స్పందిస్తూ.. '' 'వీరం' చూశాను. 'తల' ఇందులో చాలా బాగున్నాడు. పొంగల్కు సరిపోయే చిత్రమిది. తల, దర్శకుడు శివ మాస్ ప్రేక్షకుల నాడిని బాగా అర్థం చేసుకుని చిత్రాన్ని అందించారు. మళ్లీ వీక్షించేందుకు సిద్ధమయ్యాను''అని తెలిపాడు.
అజిత్, తమన్నా తొలిసారి జంటగా నటించిన చిత్రం 'వీరం'. 'శౌర్యం', 'శంఖం', 'దరువు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన శివ దీన్ని తెరకెక్కించారు. ఇందులో విదార్థ్, అప్పుకుట్టిలతోపాటు పలువురు నటించారు. అజిత్ నలుగురు తమ్ముళ్లకు అన్నగా నటించారు. ఆట ఆరంభ, చండీ చిత్రాలను అందించిన నిర్మాత డాశ్రీనుబాబు మరో భారీ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అందిస్తున్నాడు. ఒమిక్స్ క్రియేషన్స్ పతాకంపెై ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. తమిళంలో రూపొంది విడుదలై సూపర్ హిట్టైన ఈ చిత్రాన్ని తెలుగులోకి వీరుడొక్కడే పేరుతో రిలీజ్ చేస్తున్నారు.
దర్శకుడు శివ మాట్లాడుతూ.. '' శివా... గ్రామీణ వాసన నిండేలా.. కథలో బంధుత్వం, స్నేహితులు ఎక్కువగా ఉండేలా ఓ మంచి కథను ఎంచుకో. నటించాలనుందని అజిత్ చెప్పారు. అప్పుడే 'వీరం' కథ వినిపించా. ఆయన వెంటనే ఒప్పేసుకున్నారు. పండుగకు తగ్గ కుటుంబ చిత్రమిది. అజిత్ను మాస్గా చూడాలనుకునే అభిమానులకు ఇది పెద్ద పండగే.
దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ. '' అజిత్ సినిమాకు తొలిసారి సంగీతం సమకూర్చడం చాలా సంతోషంగా ఉంది. స్టూడియోకు వచ్చిన అజిత్.. అన్ని వాద్య పరికరాలను వాయించారు. అంతేకాకుండా కొన్ని ట్యూన్ల రూపకల్పనను దగ్గరుండి చూశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిది''అని చెప్పారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీః వెట్రి