Don't Miss!
- News జగన్ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిర్మాత లైంగిక వేధింపులకు నటి కేసు
తనను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని నటి నిషాయాదవ్ చేసిన ఫిర్యాదుమేరకు ఆనంద్ రాంనాథ్ అనే నిర్మాతపై పోలీసులు నాన్బెయిలబుల్ కేసు నమోదు చేశారు. తనకు అండర్ వరల్డ్ ముఠాలతో సంబంధాలున్నాయంటూ బెదిరిస్తున్నాడని, తరచూ ఫోన్ చేస్తూ వేదిస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఓ స్నేహితుడిద్వారా పబ్లో పరిచయమైన రాంనాథ్ చెన్నైకి చెందిన నిర్మాతని చెప్పుకున్నట్లు తెలిపింది. ఇక నిషా యాదవ్ ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ సినిమాలేం చెయ్యలేదు. ఈ నిర్మాత తాను అలాంటి వాడ్ని కాదని, ఆమె కావాలని తనని బ్లాక్ మెయిల్ చెయటానికే ఈ కేసు పెట్టిందని ప్తున్నాడు.
సినిమా పరిశ్రమలో సెక్సవల్ ఫేవర్స్ చాలా కామన్ అని సిని పెద్దలు ఈ నేపధ్యంలో చెప్తున్నారు. అయితే ఎవరూ మీడియాతో ఈ మాట అనటానికి ముందుకు రారని పోలీసులు అంటున్నారు. ఇక నిషా యాదవ్ తను ఎన్నో ఆసలతో సినీ పరిశ్రమకు వచ్చానని ఇలాంటి పరిణామాలు జరుగుతాయని కలలో కూడా ఊహించలేదని అంటోంది. ఇదంతా ఏదో సినిమాలో కథలా అనిపిస్తోందని, తను ఇక్కడ ఇలాంటివి జరుగుతాయని విన్నాను కానీ నిజ జీవితంలో ఎదుట పడతాయని ఊహించలేదంటోంది. స్నేహితుడుగా ఉన్న ఈ వ్యక్తి ఇలాంటి సెక్స్ వల్ బ్లాక్ మెయిల్ కి దిగుతాడని భావించలేదని చెప్పుకొచ్చింది.