Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘శశి’ కోసం పవన్ కళ్యాణ్.. ఆది సాయికుమార్ ప్లానింగ్ అదుర్స్
వారసత్వ హీరోగా వచ్చిన ఆది సాయి కుమార్కు అదృష్టం అంతగా కలిసి రావడం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఓ సాలిడ్ హిట్ కొట్టడం లేదు.ఎన్నో రకాల ప్రయోగాలు చేశాడు.. చివరకు తండ్రి సాయి కుమార్తో కలిసి నటించినా కూడా హిట్ మాత్రం పడలేదు. కెరీర్ మొదట్లో ఆదికి మంచి హిట్లు పడ్డాయి. కానీ మళ్లీ ఇంత వరకు సక్సెస్ రాలేదు. చివరగా ఆది ఆపరేషన్ గోల్డ్ ఫిష్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అయితే చాలా కాలం తరువాత ఆది మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఒకే ఒక లోకం నువ్వే అనే పాటతో శశి సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. దానికి తగ్గట్టే ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్లో చేస్తోన్నారు. చిరంజీవి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయించి అందరినీ ఆకట్టుకున్నారు. టీజర్లో డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. అయితే అప్పుడు చిరంజీవి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ను రంగంలోకి దించింది శశి యూనిట్.
శశి మూవీ ట్రైలర్ను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించబోతోన్నామని ప్రకటించి అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు. రేపు ఉదయం పది గంటల పది నిమిషాలకు ట్రైలర్ను పవన్ కళ్యాణ్ విడుదల చేయబోతన్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సురభి, రాశీ సింగ్లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. మార్చి 19న ఈ మూవీ విడుదల కాబోతోంది.