Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భయంకరంగా ‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ బైట్: టీజర్తో అంచనాలు పెంచేసిన ‘అ!’ డైరెక్టర్
వినూత్న చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం 'జాంబీ రెడ్డి'. తేజ సజ్జా, దక్ష, ఆనంది ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను యాపిల్ ట్రీ బ్యానర్పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నారు. తెలుగులోనే మొదటి జాంబీ ఫిల్మ్గా రాబోతున్న ఈ సినిమాను కరోనా వైరస్ నేపథ్యంతో తెరకెక్కించారు. టైటిల్తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా మోషన్ పోస్టర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత చేతుల మీదుగా తాజాగా 'జాంబీ రెడ్డి' ఫస్ట్ బైట్ విడుదలైంది.
టీజర్ ప్రారంభంలో గంభీరమైన గొంతుతో 'దైవం మనుష్య రూపేనా అన్నది ఇతిహాసం. రాక్షసం మనుష్య రూపేనా అన్నది ప్రస్తుతం. భగవంతుని అద్భుత సృష్టిలో ఒకే ఒక పొరపాటు. మనిషికి మేధాశక్తిని ఇవ్వడం. ఆ మేధాశక్తి తనకే ఓ ప్రశ్నగా నిలిస్తే.. దైవం నేర్పే గుణపాఠం మనిషి ఉనికికే ప్రమాదం' అంటూ వాయిస్ ఓవర్తోనే భయపెట్టాడు దర్శకుడు. ఆ తర్వాత ఈ వీడియోలో చూపించిన సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అలాగే, దీనికి మార్క్ కే రాబిన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత బలాన్నిచ్చింది. మొత్తానికి ఈ టీజర్ ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.
'అ!', 'కల్కి' చిత్రాల తర్వాత ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'జాంబీ రెడ్డి'. మనిషి మేధాశక్తి వల్ల చేసిన పొరపాట్లకు దేవుడు ఏ విధంగా గుణపాఠం చెప్పబోతున్నాడనే కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక, ఈ సినిమాలో రఘుబాబు, పృథ్వీ రాజ్, గెటప్ శ్రీను, హర్ష వర్థన్, హేమంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.