Don't Miss!
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- News నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ ! కీలక నేత గుడ్ బై..
- Finance IPO News: నేడే ప్రారంభమైన ఐపీవో.. గ్రేమార్కెట్లో దుమ్ము దులిపేస్తోంది.. బెట్ట్ వేస్తున్నారా..
- Sports హార్దిక్ వద్దు.. రోహిత్ తర్వాత అతనే భారత్ కెప్టెన్- హర్భజన్
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
విశాల్ నటించిన అయోగ్య 12న గ్రాండ్ రిలీజ్.. వాస్తవ సంఘటనల ఆధారంగా
విశాల్ హీరోగా తమిళంలో రూపొందిన అయోగ్య చిత్రం తెలుగులో అదే టైటిల్తో విడుదల కానుంది. ఏ.ఆర్.మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విశాల్ సరసన రాశీఖన్నా కథానాయికగా నటించారు. ఠాగూర్ మధు తొలిసారి తమిళంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు హక్కుల్ని సార్థక్ మూవీస్ అధినేత ప్రశాంత్ గౌడ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 12న సినిమాని తెలుగు రాష్ట్రాల్లో అత్యంత క్రేజీగా రిలీజ్ చేయనున్నారు.
నిర్మాత ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ - అయోగ్య తమిళంలో ఘనవిజయం సాధించింది. అక్కడా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లతో అదరగొట్టింది. తమిళ క్రిటిక్స్ ఈ చిత్రానికి 3.5 రేటింగులు ఇచ్చి ప్రశంసలు కురిపించారు. విశాల్ ఎనర్జీ లెవల్ను పది రెట్లు ఎక్కువగా చూపించిన సినిమా ఇది. అలాగే క్లైమాక్స్ ఈ సినిమాకే హైలైట్ అని అన్నారు.
తమిళనాడులో జరిగిన ఓ యథార్థ ఘటన ఆధారంగా పతాక సన్నివేశాల్ని దర్శకుడు తీర్చిదిద్దారు. తమిళంలో హిట్టయిన ఈ చిత్రాన్ని తెలుగులో మా సార్థక్ మూవీస్ ద్వారా రిలీజ్ చేస్తుండడం ఆనందాన్నిస్తోంది. తెలుగులో విశాల్ నటించిన సినిమాలన్నీ వరుసగా విజయాలు అందుకుంటున్నాయి. ఆ కోవలోనే అయోగ్య ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ఈనెల 12న ఏపీ- నైజాంలో రిలీజ్ చేస్తున్నాం అని ప్రశాంత్ గౌడ్ తెలిపారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ చిత్రానికి ఆయోగ్య రీమేక్. ఈ సినిమా టాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకొన్నది. అలాగే హిందీలో నిర్మించగా బాలీవుడ్లో రూ.200 కోట్లు వసూలు చేసింది.