Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ 'కెమెరామేన్ గంగతో..' మరో కొత్త రికార్డు
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. గబ్బర్ సింగ్ ఘన విజయంతో ఈ చిత్రం బిజినెస్ మంచి క్రేజ్ తో జరిగింది. ముఖ్యంగా ఈ చిత్రం యు.ఎస్ లో ఓ కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాత డివివి దానయ్య స్వయంగా మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..తాను యు.ఎస్ లో ఈ చిత్రాన్ని స్వయంగా రిలీజ్ చేస్తున్నానని, అక్కడ $ 260 k కి పదమూడు సెంటర్లు అమ్ముడుపోయిందని అన్నారు. ఇది యుఎస్ లో ఓ తెలుగు చిత్రానికి వచ్చిన హైయిస్ట్ ప్రైస్ అని ఇప్పటివరకూ ఈ రేంజి బిజినెస్ ఏ చిత్రానికి జరగలేదని అన్నారు.
తాను పవన్ కళ్యాణ్ సినిమాకు అమెరికాలో వస్తున్న ఈ క్రేజ్ కు చాలా ఆశ్చర్యపోయానని అన్నారు. ఇప్పటికి రోజూ చాలా బిజినెస్ కాల్స్ వస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోందని,అక్టోబర్ 11 న చిత్రం విడుదల చేస్తామని అన్నారు. అలాగే సెప్టెంబర్ మూడవ వారంలో ఆడియోని రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ చిత్రం పవర్ స్టార్ స్టామినాని భాక్సాఫీస్ వ్దద మరోసారి పునర్ నిర్వచిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.
బ్లూ స్కై ద్వారా అమెరికాలో 'కెమెరామేన్ గంగతో రాంబాబు' విడుదల అవుతోంది. కలర్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ వారు యూరప్, యూకే రైట్స్ తీసుకున్నారు. కేవలం యుకె రైట్స్ కే ముప్పై లక్షలు చెల్లించినట్లు సమాచారం. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రైట్స్ ని ముప్పై లక్షలకు ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఇలిక్లయిర్ ఇండియా ఎంటర్టైన్మెట్స్ వారు తీసుకున్నారు. గల్ఫ్, కువైట్ రైట్స్ ని నలభై లక్షలకు, జానకీ రత్న కుమార్ రెడ్డి తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్, తమన్నా, గేబ్రియేల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో-డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి దానయ్య, కథ-స్క్ర్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.