Don't Miss!
- News జగన్ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరంజీవి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. మొదట అదే షురూ చేయబోతున్న మెగాస్టార్!
సైరా నరసింహా రెడ్డి సినిమాతో మెగా అభిమానులను కనువిందు చేసిన మెగాస్టార్ చిరంజీవి తన 152వ ప్రాజెక్టు కోసం సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు చిరు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిపిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్డేట్ చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే స్క్రిప్ట్ పనులు, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేశారు కొరటాల. ఈ సినిమా పురాతన దేవాలయాల నేపథ్యంలో తెరకెక్కనుందని అంటున్నారు. ఇక ఇందులో చిరంజీవి లుక్ మెగా అభిమానులను మెస్మరైజ్ చేయడం ఖాయం అని తెలుస్తోంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందనేది తాజా సమాచారం. షూటింగ్ మొదలు పెట్టడమే పాటతో స్టార్ట్ చేయబోతున్నారట మేకర్స్. చిరంజీవి స్టెప్స్పై స్పెషల్ ఫోకస్ పెట్టి ముందుగా ఓ సాంగ్ షూట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట.
మరోవైపు చిరంజీవి- కొరటాల శివ ప్రాజెక్టు మొదలు కాకముందు నుంచే ఈ సినిమాలో హీరోయిన్ విషయమై పలు వార్తలు షికారు చేశాయి. మరీ ముఖ్యంగా నయనతార, త్రిష పేర్లు ఎక్కువగా వినిపించాయి. కానీ చివరకు త్రిష ఫైనల్ అయిందని తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం త్రిషతో కొరటాల శివ చేసిన సంప్రదింపులు సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించడానికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందందని ఫీల్ నగర్ టాక్.
షూటింగ్ మొదలుకాక ముందే మెగా 152పై అంచనాలు మిన్నంటాయి. మెగాస్టార్- కొరటాల కాంబోలో సినిమా చూడాలని మహా ఆతృతగా ఉన్నారు ఆడియన్స్. అతి త్వరలో ఈ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.