Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూ ఎన్టీఆర్, మహేష్ కామెంట్స్ కి దూరంగాఉండాలంటే..వదిలేస్తే బెటరే...
ఏ ముహుర్తాన తలనొప్పి బామ్ లకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారో కానీ వెంటనే మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ గట్టి ఝలక్ తిన్నారు. అమృ తాంజన్ తో ఒప్పందం చేసుకున్న వెంటనే మహేష్ కి ఖలేజా, జండూబామ్ కి సైన్ చేయగానే ఎన్టీఆర్ కి శక్తి వచ్చి పడ్డాయి. అన్నట్టు వీరిద్దరూ నవరతన్ కి జంట అంబాసిడర్లుగా కూడా పని చేస్తున్నారు. ఇద్దరికీ ఇవి అంతగా కలిసొచ్చినట్టు అనిపించడం లేదు.
మిగతా వాటి మాట ఎలా ఉన్నా కానీ నొప్పి ఆయింట్ మెంట్ లకి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తుంటే, తమ సినిమాలు వచ్చినప్పుడు వేరే హీరోల అభిమానులు తమని కామెంట్ చేయడానికి సులువైన మార్గాలు లభిస్తున్నాయని మహేష్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఖలేజా, శక్తి వచ్చినప్పడు జండూబామ్, అమృ తాంజన్ బొమ్మలు వాడి ఇతర హీరోల అభిమానులు చేసి హంగామా అంతా ఇంతా కాదు. సాధారణంగా ఇలాంటి యాడ్స్ కి హీరోలు దూరంగా ఉంటారని, బాలీవుడ్ లోనూ ఎవరూ ఇలాంటివి చెయ్యరు కాబట్టి మనోళ్లూ త్వరగా వీటిని వదిలించుకుంటే బాగుంటుందని వారు వాపోతున్నారు.