Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కీర్తి సురేష్ సూపర్ లక్కీ, ఎవరి ప్రక్కన ఓకే అయ్యిందో తెలిస్తే కంగ్రాట్స్ చెప్తారు
హైదరాబాద్ : అప్పట్లో రామ్ తో దేవదాసులో నటించి ఒక్కసారిగా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఇలియానా లాగే ఇప్పుడు కీర్తి సురేష్ కూడా దూసుకుపోతోంది. రామ్ హీరోగా తెరకెక్కిన 'నేనూ శైలజ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది కీర్తి సురేష్. ఇప్పుడు నాని హీరోగా రూపొందుతున్న నేను లోకల్ చిత్రంలో చేస్తూ బిజీగా ఉన్న వరస పెట్టి పెద్ద హీరోల సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి.
ఫోటో గ్యాలరీ : కీర్తి సురేష్
ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా లింగు స్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తుండగా, ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ఈ అమ్మడిని వరించింది.
ప్రస్తుతం మురగదాస్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు, ఆ సినిమా తరువాత తెలుగు దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో ఓ భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా చాలామంది బాలీవుడ్ తారల పేర్లు వినిపించినా, ఫైనల్ గా కీర్తి సురేష్ నే ఫైనల్ చేశారట.
ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా ఈ రెండు సినిమాలు కన్ఫామ్ అయితే మాత్రం కీర్తి సురేష్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా జెండా పాతేస్తుందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
గతంలోనే విజయనిర్మల మనవడు హీరోగా తెరకెక్కిన 'ఐనా ఇష్టం నువ్వు' అనే సినిమాలో కీర్తి హీరోయిన్ గా నటించినా.., ఆ సినిమా ఇంత వరకు రిలీజ్ కాలేదు. దీంతో రెండో సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ లో మెరిసిన ఈ భామ స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించింది. తెలుగులో తొలి సినిమాతోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుందీ ఈ మలయాళీ భామ.