Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మానవత్వాన్ని చాటిన ప్రకాశ్ రాజ్.. కరోనా సమయంలో ఏం చేశాడో తెలిస్తే షాక్
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ భయంకరంగా వ్యాప్తి చెందుతుండటంతో వ్యవస్థలన్నీ కుదేలవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాధిని అరికట్టేందుకు రంగంలోకి దిగాయి. స్వీయ గృహనిర్బంధం, జనతా కర్ఫ్యూ లాంటి కార్యక్రమాలతో వైరస్ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇలాంటి చర్యలతో దినసరి, రోజువారీ వేతన కూలీలు, ఉద్యోగులు, తక్కువ జీతం కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంలో పడింది. ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నటుడు ప్రకాశ్ రాజ్ మానవత్వాన్ని చాటుకొన్నారు. ఆయన ఏం చేశారంటే..
కరోనావైరస్తో కష్టాల్లో
కరోనావైరస్తో దిగుత తరగతి జీవితాలు కష్టాల్లోపడుతున్నాయి. రోజువారీ ఆదాయం ఉంటేగానీ పూటగడవని కుటుంబాలు ఎన్నో దేశంలో ఉన్నాయి. అలాంటి వారిపై ఇలాంటి సంఘటనలు తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి ఎవరో ఒకరు వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. వారిని చూసి స్ఫూర్తి పొందిన ప్రకాశ్ రాజ్ తన ఉద్యోగులను, సిబ్బందిని అక్కున చేర్చుకొన్నారు. తాను తీసుకొన్నచర్యలను ట్విట్టర్లో వెల్లడించారు. మీరూ చేతనైనంత సహాయం చేయాలని సూచించారు.
నా సిబ్బంది కోసం
ప్రకాశ్ రాజ్ తన ట్వీట్లో .. జనతా కర్ఫ్యూ'తో... నా నగదు నిల్వను ఒకసారి చూసుకున్నాను. నా ఇంట్లో, నా ఫార్మ్ హౌస్ లో, నా ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్ లో ఉద్యోగం చేసేవారికీ... నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించేశాను. నేను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబందించి షూటింగ్ ఆగిపోయింది. ఆ ప్రొడక్షన్లో దినసరి వేతనం తీసుకొనే కార్మికుల గురించి ఆలోచించాను అని ప్రకాశ్ రాజ్ ట్వీట్లో తెలిపారు.
|
షూటింగ్స్ నిలిచిపోయాయి
కరోనా మహమ్మారితో పాటిస్తున్న సోషల్ డిస్టెన్సింగ్ మూలంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఆ దినసరి వేతన కార్మికులకు సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించాను. ఇక్కడితో పూర్తి కాదు... నా శక్తి మేరకు చేస్తాను. మీ అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే... మీ చుట్టూ ఒకసారి చూడండి. మీ సహాయం అవసరమైనవారు ఉంటారు. వారిని ఆదుకోండి. ఒకరి జీవనాన్ని... జీవితాన్ని మీరు నిలిపే సమయం ఇది. ఒకరికి అండగా నిలవాల్సిన తరుణం ఇది అని ప్రకాశ్ రాజ్ ట్వీట్టర్లో స్పందించారు.
Recommended Video
మనమంత కలిసి జీవిద్దాం
జనతా కర్ఫ్యూ తర్వాత నాలో అనేక ఆలోచనలు మొదలయ్యాయి. చిన్న జీవితాలను ఆదుకోవాల్సిన అవసరం ఏర్పడిందని భావించాను. అందుకే నా వంతుగా, సామాజిక బాధ్యతగా నేను ముందుకు వచ్చాను. మనమంతా కలిసి బతుకుదాం అని ప్రకాశ్ రాజ్ ఓ సందేశాన్ని అందించారు.