Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్లాన్ మార్చిన అక్కినేని హీరో.. నాని దర్శకుడితో మొదటిసారి!
టాలీవుడ్ అక్కినేని హీరో నాగ చైతన్య మొత్తానికి మజిలీ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు వారుసగా అపజయాలు ఎదుర్కొన్న నాగ చైతన్యకు సమంత సపోర్ట్ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. చైతు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లలో మజిలీ టాప్ లో నిలిచింది. ఇక ఇప్పుడు కొత్త తరహా లవ్ స్టోరీతో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఊహించని దెబ్బ పడింది. దీంతో వాయిదా పడ్డ ఆ సినిమా రిలీజ్ కి టైమ్ పట్టేలా ఉంది. ఈ లోపు నాగ చైతన్య రొటీన్ గా కాకుండా కాస్త డిఫరెంట్ ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మనం దర్శకుడిని లైన్ లో పెట్టిన చైతు ఆ తరువాత నాని సెంటిమెంట్ డైరెక్టర్ తో కూడా మరో సినిమా చేయనున్నాడట.
నానితో అష్టాచమ్మా - జెంటిల్ మెన్ - V సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఇటీవల చైతుకి ఒక కథ చెప్పారట. పాయింట్ నచ్చడంతో వీలైనంత త్వరగా కథలో కొన్ని మార్పులు చేసి మరొకసారి వినిపించాలని కోరినట్లు తెలుస్తోంది. ఇటీవల పరశురామ్ తో చేయాలనుకున్న ఒక సినిమా క్యాన్సిల్ కావడంతో చైతు మోహన్ కృష్ణ డైరెక్షన్ లోనే తదుపరి సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.