Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రభాస్ బర్త్ డే రోజు అభిమానులకు డబుల్ ధమాకా!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి బాహుబలి తరువాత మరో చిత్రం రాలేదు. బాహుబలి 2 తరువాత భారీ గ్యాప్ ఏర్పడింది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో సాహో చిత్రం తెరకెక్కుతుండడంతో ఆలస్యం జరుగుతోంది. దీనితో ప్రభాస్ అభిమానులకు నిరీక్షణ తప్పడం లేదు. ఇటీవల ప్రభాస్ మరో చిత్రాన్ని కూడా ప్రారంభించాడు.
జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శత్వంలో ప్రభాస్ కొత్త చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 23 న ప్రభాస్ జన్మదిన వేడుక జరగనుంది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు డబుల్ ధమాకా అందించబబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాహో చిత్ర టీజర్ ని ప్రభాస్ పుట్టినరోజు నాడు విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అదే సమయంలో రాధాకృష్ణ దర్శత్వంలో రూపొందే చిత్రానికి సంబంధించి కూడా సర్ ప్రైజ్ ఉన్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ దర్శత్వం వహిస్తున్న చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సాహో చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.