Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మన్మధుడు 2’లో నటిస్తున్నారా?.. క్లారిటీ ఇచ్చిన సమంత!
కింగ్ నాగార్జున త్వరలో 'మన్మధుడు 2' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నటన నుంచి డైరెక్షన్ వైపు టర్న్ అయిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఈ ఇద్దరు మాత్రమే కాకుండా నాగార్జున కోడలు సమంత కూడా అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై తాజాగా సమంత రియాక్ట్ అయ్యారు.
క్లారిటీ ఇచ్చిన సమంత
‘మన్మధుడు 2'లో వెరీ ఇంట్రెస్టింగ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాను. నా పాత్ర గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. కానీ నా రోల్ ఈ స్టోరీలో చాలా ముఖ్యమైందిగా ఉంటుందనే హామీ ఇవ్వగలను. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.' అని సమంత తెలిపారు.
మన్మధుడు 2
‘మన్మధుడు 2' చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్లో జరుగుతోంది. ఈ చిత్రంలో లక్ష్మీ, వెన్నెల కిషోర్, రావు రమేష్, నాజర్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
హ్యాపీ మూడ్లో సమంత
సమంత ప్రస్తుతం హ్యాపీ మూడ్లో ఉంది. ఆమె తన బర్త నాగ చైతన్యతో కలిసి నటించిన ‘మజిలీ' చిత్రం ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. బాక్సాఫీస్ వద్ద 11 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ రూ. 50 కోట్లు రాబట్టింది.
మజిలీ
సమంత, నాగ చైతన్య 2017లో పెళ్లాడారు. వివాహం తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం ‘మజిలీ'. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంన్ష కౌశిక్ ముఖ్య పాత్రలో నటించింది. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే.