Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినిమాలకు దూరంగా ఉందామనుకొన్నా.. కానీ అతడి వల్లే మళ్లీ .. అనుష్క శెట్టి
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్కశెట్టి నటించిన నిశ్శబ్దం చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. వాస్తవానికి ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ చేయడానికి చాలా నెలలు వేచి చూశారు. కానీ లాక్డౌన్ పరిస్థితులు అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో ఓటీటీ ఫ్లాట్ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ ద్వారా రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకొన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలింస్ కార్పోరేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మాధవన్, అంజలి, మైఖేల్ మాడ్సన్, షాలిని పాండే, సుబ్బరాజు నటించారు. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్లో భాగంగా అనుష్క తెలుగు ఫిలింబీట్తో ముచ్చటిస్తూ..
కొద్ది రోజులు బ్రేక్ తీసుకొందామని
బాహుబలి, రుద్రమదేవి, భాగమతి చిత్రాల తర్వాత నేను పూర్తిగా అలసిపోయనట్టు ఫీలయ్యాను. తప్పనిసరిగా నేను కాస్త బ్రేక్ కావాలని అనుకొన్నాను. కొద్ది రోజులపాటు సినిమాలకు దూరంగా ఉందామని అనుకొంటున్న సమయంలో నిశ్శబ్దం సినిమా నా ముందుకు వచ్చింది. దర్శకుడు హేమంత్ మధుకర్ చెప్పిన నిశ్శబ్దం సినిమా కథ విన్న తర్వాత నా నిర్ణయాన్ని మార్చుకొన్నాను అని అనుష్క చెప్పారు.
మూగ యువతి పాత్ర ఛాలెంజింగ్గా
నిశ్శబ్దం సినిమా కథను దర్శకుడు హేమంత్ మధుకర్ చెప్పిన తీరు, నా పాత్రను, ఇతర పాత్రలను వివరించిన విధానం నన్ను బాగా ఆకట్టుకొన్నది. మూగ యువతి పాత్రలో కనిపించడం నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే అద్బుతంగా ఉంటుంది. ఇలాంటి అంశాలన్నీ ఈ సినిమా చేయాలనే ఆలోచనకు బలం కలిగించాయి అని అనుష్క వెల్లడించారు.
రెండు నెలలపాటు శిక్షణ
మూగ యువతి పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నాను. భారత్లో తీసుకొన్న తర్వాత అమెరికాలో మరోసారి శిక్షణ తీసుకోవాల్సి వచచింది. ఆ పాత్ర కోసం సైగలు నేర్చుకోవడానికి రెండు నెలలు పట్టింది. ఒకసారి నాపై నమ్మకం కుదిరిన తర్వాత పాత్రను పూర్తిస్థాయిలో పోషించాను అని అనుష్క శెట్టి తెలిపారు.
ఆ మాట సంతోషాన్ని ఇస్తుంది... కానీ
నిశ్శబ్దం చిత్రం విజయభారాన్ని నాపై ఉందనే మాటలు సంతోషాన్ని ఇస్తాయి. కానీ నిశ్శబ్దం కేవలం నా ఒక్కరితోనే కాదు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత మాధవన్, మైఖేల్ మ్యాడ్సన్, అంజలి, షాలిని, సుబ్బరాజు పాత్రలు వేటికి అవే బలంగా కనిపించాయి. నిశ్శబ్దం పూర్తిగా టీమ్ వర్క్. ప్రతీ పాత్ర ఆకట్టుకొనేలా ఉంటుంది అని అనుష్క చెప్పారు.
Recommended Video
నిర్మాణ విలువలు అద్భుతంగా
ఇక హేమంత్ మధుకర్ రూపొందించిన స్క్రిప్ట్ అద్భుతమైనది. అయితే స్క్రిప్టును తెరపైకి ఎక్కించేందుకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలింస్ కార్పోరేషన్ అనుసరించిన ప్రమాణాల గురించి మాటల్లో చెప్పలేను. అమెరికాలోని సియాటెల్లో షూటింగు కోసం వారు ఎక్కువగా శ్రమ తీసుకొన్నారు. దాని ఫలితమే అక్టోబర్ 2వ తేదీన తెరపైన కనిపిస్తుంది అని అనుష్క అన్నారు.