Don't Miss!
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘తెల్లవారితే గురువారం ప్రమోషన్ జోరు.. విజయ దేవరకొండ రంగంలోకి
తెల్లవారితే గురువారం అనే సినిమాపై ఇండస్ట్రీలో మంచి హైప్ క్రియేట్ ఏర్పడుతోంది. తెల్లవారితే గురువారం సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి సింహ కోడూరి, చిత్ర శుక్ల, మిష నారంగ్, సత్య అక్కల, వైవా హర్ష, రాజీవ్ కనకాల, అజయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మణికాంత్ జెల్లీ వహించారు. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని కలిసి నిర్మించారు. సంగీతం కాల భైరవ అందించారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రాజమౌళి, ఎన్టీఆర్లను తీసుకురాబోతోన్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కీరవాణి తనయులిద్దరూ మళ్లీ ఈ సినిమాతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా కదిలి వచ్చాడు. తెల్లవారితే గురువారం అనే మూవీ నుంచి మొదటి సాంగ్ను విజయ్ దేవరకొండ తాజాగా విడుదల చేశాడు. ఈ మేరకు విజయ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా మెల్లిగా మెల్లిగా అనే పాటను వదిలాడు.
నా సోదరులు సింహ కోడూరి, కాళ భైరవలకు విజయం చేకూరాలి.. మార్చి 27న రాబోతోన్న తెల్లవారితే గురువారం సినిమా సక్సెస్ అవ్వాలని చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. మార్చి 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. దానికి రాజమౌళి, ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా రాబోతోన్నారు.