Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్: మహేష్ ఒక్కడు సినిమాలో గోపిచంద్.. జస్ట్ మిస్!
2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక్కడు సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అప్పటివరకు నార్మల్ హీరోగా ఉన్న మహేష్ బాబుని మాస్ హీరోలకు మరింతగా దగ్గర చేసిన ఆ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ఇండస్ట్రీ టాప్ హిట్స్ లో ఒకటైన ఆ సినిమాకు సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ పై లుక్కేస్తే ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడింది.
గుణశేఖర్ ప్రయత్నాలు..
దర్శకుడు గుణశేఖర్ చూడాలని ఉంది సినిమా తరువాత మహేష్ చేస్తున్న సినిమాలు చూసి తప్పకుండా అతనితో ఒక సినిమా చేయాలని ట్రై చేశాడు. మృగరాజు సినిమా అనంతరం మహేష్ బాబుకి ఒక్కడు స్క్రిప్ట్ వినిపించిన గుణశేఖర్ చాలా మంది నిర్మాతలను కలిశాడు. రామోజీరావు మొదట్లో ఒప్పుకున్నప్పటికి చార్మినార్ సెట్ వేయడం ఇష్టం లేక నో చెప్పారట.
గోపిచంద్ జస్ట్ మిస్..
ఇక యమ్ఎస్.రాజు నిర్మాతగా సెట్టయిన తరువాత సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎండ్ అవుతున్న తరుణంలో సినిమాలో విలన్ విషయంలో మార్పులు జరిగాయట. మొదట ప్రకాష్ రాజ్ స్థానంలో విలన్ గా హీరో గోపిచంద్ ని అనుకున్నారట. అప్పటికే జయం సినిమాలో విలన్ గా నటించిన గోపిచంద్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే మహేష్ తో పాటు నిర్మాత ఆలోచన మేరకు గుణశేఖర్ ప్రకాష్ రాజ్ ని సెలెక్ట్ చేసుకున్నారట.
అలా ఎందుకు జరిగిందంటే..
2003లో మహేష్ బాబు ఒక్కడు సినిమాతో పాటు తేజ డైరెక్షన్ లో నిజం సినిమా కూడా చేశాడు. దాదాపు రెండు సినిమాలు ఒకే సమయంలో ఒప్పుకోవడంతో రెండు సినిమాల్లో విలన్ గా గోపిచంద్ ఉండడం కరెక్ట్ కాదని మహేష్ అభ్యంతరం వ్యక్తం చేశాడట. దీంతో నిర్మాత ప్రకాష్ రాజ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు.
Recommended Video
అందుకే వర్షంలో విలన్ గా..
నిర్మాత MS.రాజు ఒక్కడు హిట్ తరువాత వర్షం సినిమాను ప్లాన్ చేస్తుండగా ఆ సినిమాలో విలన్ గా గోపిచంద్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఒక్కడు సినిమాలో గోపిచంద్ కి ఛాన్స్ మిస్ అయ్యిందని దర్శకుడితో మాట్లాడి ప్రభాస్ సినిమాలో ఛాన్స్ ఇప్పించారు. ఆ విధంగా గోపిచంద్ ఒక్కడు సినిమాలో ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ ని మిస్సయ్యాడు.