Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రకుల్ ప్రీత్ పీఠానికి పూజా హెగ్డే ఎసరు.. జోరు మీదున్న బికినీ భామ
దువ్వాడ జగన్నాథం ముందు వరకు యువ హీరోయిన్లలో అందాల తార రకుల్ ప్రీత్ సింగ్దే హవా. అగ్ర హీరోయిన్లతోనూ జతకట్టింది. రకుల్ నటించిన చిత్రాలన్నీ సక్సెస్ బాట పట్టాయి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్నాయి. హి
దువ్వాడ జగన్నాథం ముందు వరకు యువ హీరోయిన్లలో అందాల తార రకుల్ ప్రీత్ సింగ్దే హవా. అగ్ర హీరోయిన్లతోనూ జతకట్టింది. రకుల్ నటించిన చిత్రాలన్నీ సక్సెస్ బాట పట్టాయి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్నాయి. హిందీలో ఓ సినిమా చేస్తున్నది. దాంతో ఇటీవల పవన్ కల్యాణ్, మహేశ్ బాబు సినిమాలను రిజెక్ట్ చేసింది. అయితే దువ్వాడ జగన్నాథం హిట్ తర్వాత టాలీవుడ్కు హాట్ హాట్ ఫిగర్ రూపంలో పూజా హెగ్గే దొరికింది. ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాల చూపంతా పూజా హెగ్డేపైనే పడింది.
దువ్వాడ జగన్నాథం చిత్రంలో పూజా హెగ్డే ఆరబోసిన అందాలకు యూత్ ఫిదా అయిపోయారు. బికినీ సీన్లో బోల్డ్గా నటించడం సినీ వర్గాల్లో చర్చనీంశమైంది. పాటలు, డ్యాన్సుల్లోనూ ఆకట్టుకొన్నది. అగ్రహీరోలతో జతకట్టే అంశాలన్నీ ప్రస్తుతం పూజా హెగ్డేలో కనిపిస్తున్నాయి. దాంతో రకుల్ పీఠానికి పూజా హెగ్గే ఎసరు పెట్టే అవకాశాలున్నాయనే మాట వినిపిస్తున్నది. మహేశ్ బాబు 25వ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే కన్ఫర్మ్ అయిందనే మాట వినిపిస్తున్నది. కాగా స్పైడర్ చిత్రంలో మహేశ్ సరసన రకుల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.