Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లువారబ్బాయికి రామ్ చరణ్ సలహా.. ఇంతకీ వర్కవుటయ్యేనా?
కెరీర్లో సరైన హిట్ కొట్టి సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకోవాలని తహతహలాడుతున్నాడు అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తండ్రి అల్లు అరవింద్ బడా నిర్మాతగా, అన్న అల్లు అర్జున్ టాప్ స్టార్ గా కొనసాగుతుండటంతో వారి బాటలోనే అల్లు శిరీష్ కూడా ఆ స్థాయికి ఎదగాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మేరకు వరుస సినిమాలు చేస్తున్నా కూడా ఇతగాడికి సరైన హిట్ పడకపోవడంతో రామ్ చరణ్ ఓ సలహా ఇచ్చారట. వివారాల్లోకి వెళ్తే..
అల్లు శిరీష్ తాజా సినిమా ఏబీసీడీ. మలయాళంలో ఇదే పేరుతో విడుదలై సూపర్ హిట్ సాధించిన చిత్రానికి రీమేక్ ఈ మూవీ. తన మేనమామ కొడుకు అల్లు శిరీష్ కెరీర్ గాడిలో పడాలంటే ఎలా ఆలోచించిన రామ్ చరణ్.. అతనికి ఓ విలువైన సలహా ఇచ్చారట. మలయాళంలో వచ్చిన ఏబీసీడీ చిత్ర రీమేక్ లో నటించు. నీ బాడీ లాంగ్వేజ్ కి ఇది సరిగ్గా సూట్ అవుతుందని శిరీష్ తో చెప్పారట రామ్ చరణ్. అంతేకాదు మలయాళ ఏబీసీడీ సీడీ తెచ్చిచ్చి వెంటనే ఈ సినిమా చూడమని చెప్పాడట. సినిమా చూడగానే శిరీష్ కి కూడా ఈ మూవీ బాగా నచ్చడంతో చెర్రీ సలహా మేరకు దర్శక నిర్మాతలను వెతికే పనిలో పడ్డాడట శిరీష్. అందుకే ఈ సినిమా ఇంత లేట్ అయిందట. ఈ విషయాలన్నీ అల్లు శిరీషే స్వయంగా వెల్లడించారు. సోమవారం జరిగిన ఏబీసీడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేదికపై ఈ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు శిరీష్.
మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్పై మధుర శ్రీధర్ రెడ్డి , బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఏబీసీడీ చిత్రంలో అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాల నటుడు భరత్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాజా, కోటా శ్రీనివాస రావు, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 17 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.