శుభాకాంక్షలు తెలిపిన పవన్, మహేష్, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్
రంజాన్ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు ముస్లింలకు విషెస్ తెలిపారు. పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా విష్ చేశారు,.
హైదరాబాద్: నెలరోజుల పాటు పవిత్ర ఉపవాస దీక్షలు ఆచరించి నేడు 'రంజాన్' వేడుక జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు టాలీవుడ్ స్టార్స్ శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్ టాప్ స్టార్లు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ తదితరులతో పాటు సినీ ప్రముఖులంతా సోషల్ మీడియా ద్వారా ఈద్ ముబారక్ తెలిపారు.
మానాళికి సద్భుద్ధిని ప్రభోధించడానికి దివ్య ఖురాన్ అవతరించిన మాసం ఇది. అందు వల్ల ఈ మాసం అత్యంత పవిత్రమైన మాసం. ఖురాన్ ప్రవచించిన శాంతి, సహనం, దయ, సేవాతత్పరత, దాన గుణాలను సమాజంలోని ప్రతీ ఒక్కరు ఆచరిస్తే సుఖసంతోషాలు పరిడవిల్లుతాయి. తద్వారా సమసమాజం ఆవిర్భవిస్తుంది. అటువంటి మేలైన సమాజమే జనసేన కాంక్ష, ఆకాంక్ష... పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని ముస్లిం సోదరులకు, ప్రపంచంలోని ముస్లిం సమాజానికి నా తరుపున, జనసేన శ్రేణుల తరుపున సోదరపూర్వక శుభాకాంక్షలు. ఈద్ ముబారక్ హో..... అంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్
.
మహేష్ బాబు విషెస్
.
రామ్ చరణ్ ఈద్ ముబారక్
.
ఎన్టీఆర్
.


Click it and Unblock the Notifications











