Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అవినీతి ఉద్యమం కోసం రజనీ ఉచితంగా...
అవినీతిపై పోరాటం చేస్తున్న అన్నా హజారే బృందం ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో దీక్ష చేయడానికి ఎంఎంఆర్డి గ్రౌండ్ కు రూ. 8లక్షల అద్దె కట్టే స్తోమత లేక తమ ప్రయత్నాన్ని విరమించుకుంది అన్నా బృందం. అయితే అన్నా అవినీతి పోరాటానికి సూపర్ స్టార్ రజనీ కాంత్ అండగా నిలవడానికి ముందుకు వచ్చారు. చెన్నయ్ లో దీక్ష చేస్తే నగరం నడి ఒడ్డున గల తన రాఘవేంద్ర కళ్యాణ మంటపాన్ని మూడు రోజుల పాటు ఉచితం ఇచ్చేందుకు అంగీకరించారు.
భారత అవినీతి వ్యతిరేక కమిటీ మెంబర్ ఎంఎస్. చంద్రమోహన్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడిస్తూ....తమ అభ్యర్థనకు రజనీకాంత్ సానుకూలంగా స్పందించారని, కళ్యాణ మంటపాన్ని దీక్ష కోసం ఉచితంగా ఇచ్చేందుకు అంగీకరించారని వెల్లడించారు.
ఇప్పటికే అనేక మందికి అండగా నిలుస్తూ సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్...తాజాగా అవినీతి కి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి తన వంతు సాయం చేయడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.