Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రజనీ ఫ్యాన్స్పై పిడుగులాంటి వార్త.. రోబో2.0 విషయంలో అసంతృప్తి
సూపర్స్టార్ రజనీకాంత్ అభిమానులపై పిడుగులాంటి వార్త పడింది. ఇప్పటికే ఆలస్యమైన రోబో2కు సంబంధించిన ఓ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారవుతున్నది. వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కారణంగా ఈ చిత్ర విడుదల జాప్యం జరుగడం మరింత కుంగదీస్తున్నది. ఈ చిత్రానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంటిగ్రేషన్ (సీజీఐ) పనులపై చిత్ర యూనిట్, దర్శకుడు శంకర్ పెదవి విరిచాడట. దాంతో ఈ చిత్రానికి మరిన్ని మార్పులు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారట. త్వరలోనే మార్పులకు సంబంధించిన సీజీ పనులు మొదలుపెట్టనున్నట్టు సమాచారం.
రోబో2 చిత్రాన్ని వాస్తవానికి 2018 మేలో రిలీజ్ చేయాలనుకొన్నారు. దానిని ఆగస్టుకు వాయిదా వేశారు. విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా మళ్లీ 2019కి వాయిదా వేశారు. భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.