Don't Miss!
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా కెరీర్లో చాలా కొత్తగా ట్రై చేశాను: ‘మిస్టర్ కెకె’ ప్రీ రిలీజ్ ఈవెంటులో విక్రమ్
తమిళ నటుడు విక్రమ్ త్వరలో 'కడరమ్ కొండన్' అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాజేష్ ఎం సెల్వ దర్శకుడు. జులై 19న ఈ మూవీ తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ మూవీ 'మిస్టర్ కెకె' పేరుతో విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా మంగళవారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బేనర్లో ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. విక్రమ్తో పాటు అక్షర హాసన్, అభి హాసన్, లీనా, వికాష్, జాస్మిన్, చెర్రీ, రాజేష్ కుమార్, రవీంద్ర, పురవాలన్, సిద్దార్థ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో విక్రమ్ మాట్లాడుతూ... ''మీరు ఈ మూవీ ట్రైలర్ చూశారు, మేకింగ్ చూశారు. కాస్త డిఫరెంటుగా ట్రై చేశాం. ఈ సినిమాకు పని చేసిన టీమ్ మొత్తానికి థాంక్స్. ఇందులో మరో హీరోగా అభి హాసన్ నటించాడు. అక్షర హాసన్ ఎంతో బాగా చేసింది. అక్షర వల్ల ఈ సినిమాకు మరింత బ్యూటీ యాడ్ అయింది. నా కెరీర్లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తున్నాను. ఇది నా మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్.'' అన్నారు.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన చియాన్ విక్రమ్ లుక్ మేకింగ్ వీడియో విడుదల చేయగా అభిమానులు ఫిదా అయిపోయారు. ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ కనిపించనంత స్టైలిష్గా డిఫరెంట్ మేకోవర్తో విక్రమ్ ఎంట్రీ ఉండబోతోంది.
'కడరమ్ కొండన్' చిత్రాన్ని ఎక్కువగా మలేషియాలో చిత్రీకరించారు. రాజ్ కమల్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న 45వ సినిమా ఇది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో విక్రమ్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో గ్రాండ్గా రిలీజ్ ప్లాన్ చేశారు.
ఈ సినిమా పూర్తయిన తర్వాత విక్రమ్ తన నెక్ట్స్ మూవీ 'మహావీర్ కర్ణ' చిత్రంలో బిజీ కాబోతున్నారు. ఈ మూవీని రూ. 300 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. దర్వకుడు ఆర్ఎస్ విమల్ ఈ పీరియడ్ డ్రామాను హ్యాండిల్ చేస్తున్నారు.