Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Vadinamma : దమయంతి దుర్మార్గాలు బట్టబయలు.. రఘురామ్ కాళ్ళ మీద పడ్డ శిల్ప తండ్రి!
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది.. ప్రస్తుతం ఈ సీరియల్ 662వ ఎపిసోడ్ కి చేరింది. టెలివిజన్ స్టార్ ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సీరియల్ లో ప్రస్తుతం రఘురాం కుటుంబం అంతా కష్టాలపాలు అవుతుండటం చూపిస్తున్నారు. దమయంతి తన కూతుర్ని అల్లుడిని ఇల్లరికం తీసుకువెళ్లాలని ప్రయత్నించగా ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ప్లాన్ ఫెయిల్ అవటమే కాక సీతకు అన్ని విషయాలు తెలిసిపోవడంతో దమయంతిని వణికిపోయే లాగా చేస్తుంది సీత. ఆ దెబ్బతో మొత్తానికి వణికిపోయిన దమయంతి ఇంట్లో ఉన్న అందరికీ క్షమాపణలు చెప్పి రఘురాం తల్లి కాళ్లు పట్టుకుని మరీ ఇంటి నుంచి బయట పడుతుంది. ఆ తర్వాత పూర్తిగా మారిపోయిన శిల్ప ఈ విషయాలన్నీ సిరి, శైలుకి తెలిస్తే బాధపడతారు అని తనను తప్పుగా అర్థం చేసుకుంటారు అని అంటుంది. అయితే నేను చెప్పను నువ్వు కూడా చెప్పొద్దు అని అంటుంది. అంత క్షమాగుణం ఎలా అక్క అని అడిగితే తల్లి తన బిడ్డ తప్పును కడుపులో దాచుకుంటూ ఉందని నేను కూడా అంతే అని ఆమె అంటుంది. ఇక అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు.
Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్
రఘురాం ఇంటికి
ఈరోజు ఎపిసోడ్ లో భరత్ కూర్చుని పాటలు వింటూ ఉంటాడు, పాటలు వింటుంటే సిరి వచ్చి నువ్వు కాలేజీకి వెళ్లాలని అలా వెళ్లి చదువుకుని అందరి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అంటుంది. అయితే ముందు భరత్ ఆసక్తి చూపించరు కానీ సిరి బాధపడుతున్న విషయం అర్థం చేసుకుని నేను కాలేజీ కి వెళ్తాను అని అంటారు. అయితే సినిమా మాత్రం నువ్వు చదువు పూర్తయ్యే వరకు ఈ విషయాన్ని ఎక్కడా ఓపెన్ చేసి చెప్పకూడదు అని అంటుంది దానికి భరత్ కూడా సరే అంటాడు. ఇక మరో పక్క దమయంతి బాధపడుతూ ఉండగా ఆమె భర్త మాత్రం రఘురాం ఇంటికి వెళతాడు. తన తండ్రి వచ్చిన విషయాన్ని చూసి శిల్ప ఆనందం వ్యక్తం చేస్తుంది. అయితే తల్లి మీద తనకు ఎలాంటి ద్వేషం లేదని కాకపోతే ఆమె చేస్తున్న పనులు నచ్చక పోవడంతో నేను మాట్లాడటం లేదని శిల్ప అంటుంది.
దమయంతి చేసిన దుర్మార్గాలు
అయితే లేటుగా అయినా నిజం తెలుసుకున్నావు మీ అమ్మ గురించి నేను ఎన్నో సార్లు నీకు చెప్పి చూశాను కానీ నువ్వే వినలేదు అని శిల్ప తండ్రి అంటాడు. ఒకసారి రఘురాం తో మాట్లాడి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు శిల్ప తండ్రి. లోపలికి వెళ్ళి కూర్చుని మాట్లాడుతూ ఉండగా సీతకు అనుమానం వచ్చి శిల్పను లోపలికి వెళ్ళమని చెబుతుంది. ఇక సీత అనుమానపడినట్లు గానే రఘురాం దగ్గరికి వచ్చిన దమయంతి భర్త దమయంతి చేసిన దుర్మార్గాలు అన్ని బయటపెడతాడు. మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టింది దమయంతి అని అంటాడు. ముందుగా ప్లాస్టిక్ బియ్యం అమ్మించింది, ఆమేనని ఆ తర్వాత శ్యామసుందరుని భయపెట్టి గో డౌన్ ఖాళీ చేయించిందని అలాగే బండి కూడా వెనక్కి తీసుకునేలా చేసింది అని అంటాడు. ఇక ఇంట్లో తడిచిపోయిన బియ్యం బస్తాలు గురించి కూడా చెప్పి అది శిల్ప చేసిన పనే అని ఆమె తల్లి ప్రోద్బలంతోనే ఆమె ఇలా చేసిందని అంటాడు.
మంచి బుద్ధి వచ్చి
ఎక్కడైనా ఒక చోట లాభం జరిగితే మరోచోట నష్టం జరుగుతుంది అలాగే ఒకచోట నష్టం జరిగితే మరోచోట లాభం జరుగుతుంది అని ఆయన అంటాడు. మీ ఇంట్లో నష్టం జరిగినా సరే మా అమ్మాయికి మంచి బుద్ధి వచ్చి ఇప్పటికైనా తల్లి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకుందని దమయంతి భర్త అంటాడు. అయితే రఘు రామ్ కి పట్టరాని కోపం వస్తుంది వెంటనే శిల్పం గట్టిగా పిలుస్తాడు.
లక్ష్మణ్ ఉద్యోగం కోసం
రఘురాం కోపం చూసి సీత కూడా భయపడుతుంది పిల్లని ఏమీ అనవద్దు ప్లీజ్ అని ప్రాధేయ పడుతూ ఉంటే శిల్ప దగ్గరికి వచ్చాక మాకు నష్టం కలిగితే మీకు లాభం కలిగిందని అన్నారు కానీ మా నష్టమే మాకు లాభం కలిగించింది అని రఘురాం అన్నాడు. శిల్ప మా అమ్మాయి కాబట్టి ఆమె మంచిగా మారితే అది మాకు లాభమే కదా అని అంటాడు రఘురాం. ఇక అలా రఘురాం ఇంటి నుంచి దమయంతి భర్త వెళ్ళిపోతాడు. మరోపక్క లక్ష్మణ్ ఉద్యోగం కోసం శైలు పెట్టిన అప్లికేషన్ వర్కౌట్ అవుతుంది. ఉద్యోగం ఫైనల్ కావడంతో రేపటి నుంచి జాయిన్ కమ్మని మెయిల్ పంపిస్తారు.
నేరుగా చెబుతాను అని
మంచి సంతోషం లో ఉన్న శైలు ఈ విషయాన్ని సిరి, సీత ఇద్దరికీ చెప్పి తాను లక్ష్మణ్ దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని నేరుగా చెబుతాను అని అంటుంది. అదే షాపుకి వెళ్లి లక్ష్మణ్ కి ఈ విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తే లక్ష్మణ్ మాత్రం ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపించడు ఇక్కడ పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా నేను ఆ ఉద్యోగం చేయను అంటాడు. అయితే చాలా సేపు శైలు గొడవ పడిన తర్వాత ఇక లాభం లేదనుకుని ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసి అలిగి కూర్చుంటే లక్ష్మణ్ ఆమెను బుజ్జగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలా ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రఘురాంకి 25 లక్షలు అప్పు ఇచ్చిన వ్యక్తి వెంటనే ఆ డబ్బు కావాలని తనకు బ్యాంక్ లోను రావడంతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అని చెబుతాడు. అలా ఒక ఇబ్బంది తప్పింది అనుకుంటున్న క్రమంలో మరో ఇబ్బంది రఘురాం కుటుంబాన్ని ఎదుర్కోబోతోంది మరి చూడాలి ఏం జరగబోతోంది అనేది.