Don't Miss!
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘సైమా’ వేడుకకు మరింత గ్లామర్... ముఖ్య అతిథులుగా చిరంజీవి, మోహన్ లాల్
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2019 వేడుక ఈ సారి ఖతార్లో వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్ట్ 15, 16 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమంలో సౌతిండియాలోని నాలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టార్లెు సందడి చేయబోతున్నారు.
ఈ సారి సైమాకు ముఖ్య అతిథులుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ హాజరు కాబోతున్నారు. ఈ ఇద్దరి రాకతో ఈ షోకు మరింత గ్లామర్ వస్తుందని, గతంలో ఎన్నడూ లేనంత గ్రాండ్గా ఈ షో చేయబోతున్నట్లు సైమా నిర్వాహకులు ప్రకటించారు.
ఈ సైమా అవార్డుల్లో రంగస్థలం చిత్రం అత్యధికంగా 12 కేటగిరీల్లో నామినేట్ అయింది. మహానటి చిత్రాని 9 నామినేషన్స్, గీత గోవిందం మూవీకి 8 నామినేషన్స్, అరవింద సమేతకు 6 నామినేషన్స్ వచ్చాయి. ఎవరికి ఏ అవార్డు దక్కుతుంది, ఏ మూవీ ఎన్ని అవార్డులు దక్కించుకుంటుంది అనేది ఆగస్టు 15, 16 తేదీల్లో తేలనుంది.
కేవలం తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి మాత్రమే కాదు... కన్నడ, మలయాళం, తమిళ చిత్రాలకు కూడా అవార్డుల ప్రధానం జరుగబోతోంది. ఖతార్లో రెండు రోజుల పాటు వైభవంగా జరిగే ఈ వేడుకకు ఈ సారి వీలైనంత ఎక్కువ మంది స్టార్లను తీసుకొచ్చేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.