Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గద్దలకొండ గణేష్తో బాగా ఎంజాయ్ చేశా.. 20న గత్తర లేపాల!.. నితిన్ కామెంట్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిందిన కొత్త సినిమా 'వాల్మీకి'. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో వరుణ్ సరసన పూజా హెగ్డే నటించింది. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్గా వాల్మీకి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 20వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. గద్దలకొండ గణేష్ అనే నెగిటివ్ ఛాయలున్న పాత్రలో కనిపించనున్నాడు వరుణ్ తేజ్. అదేవిధంగా తమిళ హీరో అధర్వ కీలకపాత్రలో నటించాడు. ఇక సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం, డైరెక్టర్ సకుమార్, హీరో నితిన్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రల్లో కనిపించనుండటం విశేషం.
అయితే సెప్టెంబర్ 20వ తేదీన వాల్మీకి విడుదల కానున్న నేపథ్యంతో ట్విట్టర్ వేదికగా సందేశమిస్తూ చిత్రయూనిట్కి శుభాకాంక్షలు చెప్పాడు నితిన్. ''మిస్టర్ గద్దలకొండ గణేష్తో నేను. వాల్మీకి సినిమాలో నటించేటప్పుడు చాలా ఎంజాయ్ చేశా. ఈ రోజులు చాలా సరదాగా గడిచాయి. ఈ సినిమా విడుదల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇట్లు.. మీ భీష్మ. సెప్టెంబర్ 20న గత్తర లేపాల హరీష్'' అని ట్వీట్ లో పేర్కొన్నాడు.